దేశంలోనే అత్యధికంగా అధికార భారతీయ జనతా పార్టీ రూ.11,562 కోట్ల విరాళాలు కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందుకుంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. దానికి రూ.3,214 కోట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్కు రూ.2,818 కోట్లు, నాలుగో స్థానంలోని భారత రాష్ట్ర సమితికి రూ.2,278 కోట్లు ఎన్నికల బాండ్ల జారీ ద్వారా అందాయి.
ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్కు రూ.1550 కోట్లు, తమిళనాడును పాలిస్తున్న డీఎంకే పార్టీకి రూ.1230 కోట్లు, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి రూ.662 కోట్లు విరాళంగా వచ్చాయి. టీడీపీకి రూ.437 కోట్లు, జనసేన పార్టీకి రూ.42 కోట్లు, ఉద్ధవ్ శివసేనకు రూ.316 కోట్లు, లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీకి రూ.145 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.130 కోట్లు విరాళంగా అందాయి..
2018 నుంచి ఇప్పటివరకు బీజేపీకి అత్యధికంగా 8,633, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 3,305, కాంగ్రెస్ పార్టీకి 3,146, ఆమ్ ఆద్మీ పార్టీకి 245, డీఎంకేకు 648, బాండ్ల జారీ ద్వారా విరాళాలు వచ్చాయి. భారత రాష్ట్ర సమితికి 1,806 ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 472, టీడీపీకి 279, జనసేన పార్టీకి 39 ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందాయి.
ఎక్కువ ఎలక్టోరల్ బాండ్లను కోయంబత్తూరు కేంద్రంగా పని చేసే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ కొనుగోలు చేసింది. వేర్వేరు పేర్లతో ఈ సంస్థ కేరళ, సిక్కిం తదితర రాష్ర్టాల్లో లాటరీ వ్యాపారం నిర్వహిస్తున్నది. ఈ సంస్థ రూ.1,368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. లాటరీ కింగ్గా పేరున్న మార్టిన్ శాన్టియాగో ఈ సంస్థకు యాజమాని. ఈ సంస్థపై మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ విచారణ జరుపుతున్నది.
ఈసీ వెల్లడించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలపై కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలను లేవనెత్తింది. దాతల వివరాల్లో 18,871 ఎంట్రీలు ఉండగా, బాండ్లు అందుకున్న వారి వివరాల్లో 20,421 ఎంట్రీలు ఎందుకున్నాయని, ఈ వ్యత్యాసానికి కారణమేంటని కాంగ్రెస్ నేత అమితాబ్ దూబే ఎక్స్లో ప్రశ్నించారు.
ఎలక్టోరల్ బాండ్ల కేసులో మార్చి 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్నికల కమిషన్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారించనుంది. ఇంతకుముందు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేట్మెంట్లను ఈసీ కార్యాలయంలో పెట్టాలని సుప్రీంకోర్టు మార్చి 11న ఈసీని ఆదేశించింది.
అయితే, పారదర్శకత పాటించేందుకు గానూ ఈ డాక్యుమెంట్ల కాపీలను తమ వద్ద పెట్టుకోలేదని, కాబట్టి కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లను తిరిగివ్వాల్సిందిగా సుప్రీంకోర్టును ఈసీ కోరింది.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
మసాలా సుగంధ ద్రవ్యాలపై దేశవ్యాప్తంగా తనిఖీలు