34మంది అభ్యర్థులతో టీడీపీ రెండో జాబితా 

* పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ

మొత్తం 34 మందితో టీడీపీ ఈ జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం టీడీపీ తొలిజాబితాలో 94 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.  దీంతో టీడీపీ మొత్తం 128 అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది.
 
రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆత్మకూరు నుంచి ఆనం రాంనారాయణ రెడ్డి, దెందలూరు నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ పోటీ చేయాల్సిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తోంది. మరో 16 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
 
టీడీపీ రెండో జాబితాలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలకు చోటు దక్కింది. రెండో జాబితాలో పీహెచ్‌డీ చేసిన వారు ఒక్కరు, పీజీ చేసిన వారు 11మంది, గ్రాడ్యుయేట్లు తొమ్మిది మంది, ఇంటర్మీడియట్ చదివిన వారు ఎనిమిది మంది, 10వ తరగతి చదివిన వాళ్లు ఐదుగురు ఉన్నారు.
 
ఇలా ఉండగా, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్ర‌క‌టించారు. లోక్ స‌భ‌కు పోటీ చేసే ఆలోచ‌న లేద‌ని తేల్చి చెప్పారు. గ‌తంలో భీమ‌వ‌రం, గాజువాక‌లో పోటీ చేసిన తాను ఈసారి పీఠాపురం బ‌రిలో దిగుతున్న‌ట్లు చెప్పారు.. అభ్యర్థుల జాబితా ఇదే!

  • నరసన్నపేట – బగ్గు రమణ మూర్తి
  • గాజువాక – పల్లా శ్రీనివాసరావు
  • చోడవరం – కేఎస్ఎన్ఎస్ రాజు
  • మాడుగుల పైలా ప్రసాద్
  • ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ
  • రామచంద్రాపురం – వాసంశెట్టి సుభాష్
  • రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • రంపచోడవరం – మిర్యాల శిరీష
  • కొవ్వూరు – ముప్పిడి వెంకటేశ్వరరావు
  • దెందులూరు – చింతమనేని ప్రభాకర్
  • గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు
  • పెదకూరపాడు – భాష్యం ప్రవీణ్
  • గుంటూరు వెస్ట్ – పిడుగురాళ్ల మాధవి
  • గుంటూరు ఈస్ట్ – మహ్మద్ నజీర్
  • గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
  • కందుకూరు – ఇంటూరి నాగేశ్వరరావు
  • మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి
  • గిద్దలూరు – అశోక్ రెడ్డి
  • ఆత్మకూరు – ఆనం రాంనారాయణ రెడ్డి
  • కోవూరు (నెల్లూరు)- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
  • వెంకటగిరి – కురుగొండ్ల లక్ష్మీప్రియ
  • కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి
  • ప్రొద్దుటూరు – వరదరాజుల రెడ్డి
  • నందికొట్కూరు (ఎస్సీ)- గిత్త జయసూర్య
  • ఎమ్మిగనూరు – జయనాగేశ్వర రెడ్డి
  • మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి
  • పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి
  • కదిరి- కందికుంట యశోదా దేవి
  • మదనపల్లి- షాజహాన్ బాషా
  • పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)
  • చంద్రగిరి- పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)
  • శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
  • సత్యవేడు- కోనేటి ఆదిమూలం (ఎస్సీ)
  • పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళీ మోహన్