14 లేదా 15 తేదీల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్!

వచ్చే గురువారం లేదా శుక్రవారం (14 లేదా 15) రోజున లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం పర్యటించింది. ఇక సోమవారం నుంచి బుధవారం వరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఈ పర్యటన ముగియగానే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.

బుధవారం జమ్మూ కాశ్మీర్‌ పర్యటన ముగియగానే గురువారం లేదా శుక్రవారం రోజున లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచనలు చేసింది. 

ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికలతోపాటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం అవుతుందో కాదో పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి బుధవారం వరకు అధికారులు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

ఇక లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడంతోనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలు గానీ, కేంద్రంతోపాటు ఆయా రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు గానీ ఎన్నికల హామీలు గానీ, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు గానీ పూర్తి చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు సహితం 13తో ముగియనున్నాయి.

శుక్రవారమే ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా భద్రతా సిబ్బంది మోహరింపు, తరలింపుపై కేంద్ర హోంశాఖ, రైల్వే అధికారులతో  భద్రతా సమావేశం నిర్వహించింది.  ఇక జమ్మూ కాశ్మీర్లో చివరగా 2014 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370 ని కేంద్ర ప్రభుత్వం 2019 లో రద్దు చేసింది. అనంతరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.

ఇక లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడంతోనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలు గానీ, కేంద్రంతోపాటు ఆయా రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు గానీ ఎన్నికల హామీలు గానీ, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు గానీ పూర్తి చేయాల్సి ఉంటుంది.  ఇక జమ్మూ కాశ్మీర్లో చివరగా 2014 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370 ని కేంద్ర ప్రభుత్వం 2019 లో రద్దు చేసింది. అనంతరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.