మొదటి ‘మహిళా స్నైపర్’కు స్వాగతం పలుకుతూ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో బీఎస్ఎఫ్ ఓ పోస్ట్ చేసింది. బీఎస్ఎఫ్.. నిజంగా సమ్మిళితమవుతోందని తెలిపింది. “బీఎస్ఎఫ్ నిజంగా సమ్మిళిత శక్తిగా మారుతోంది. ప్రతిచోటా మహిళలువేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ దిశగా ఒక అడుగు పడింది. కఠినమైన శిక్షణ తరువాత, #BSF.. తన మొదటి మహిళా స్నైపర్ని పొందింది,” అని పోస్ట్లో పేర్కొంది బీఎస్ఎఫ్.
హిమాచల్ ప్రదేశ్కు చెందిన సుమన్ పంజాబ్లో ఒక ప్లాటూన్కు కమాండర్ గా ఉన్నారు. సరిహద్దు వెంబడి స్నైపర్ దాడుల ముప్పును గమనించిన తరువాత స్నైపర్ కోర్సు చేయాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ముల్లును ముల్లుతోనే తీయాలని నిశ్చయించుకున్న సుమన్ కోర్సులో పాల్గొనడానికి తన ఉన్నతాధికారుల ఆమోదం పొందారు.
స్నైపర్ కోర్సులో 56 మంది పురుషుల్లో సుమన్ ఒక్కరే మహిళ కావడం విశేషం. కమాండో ట్రైనింగ్ తర్వాత ఈ కోర్సును అత్యంత కఠినమైన శిక్షణగా పరిగణిస్తారు. సుమన్ సాధించిన విజయం ఇతర మహిళలకు స్ఫూర్తిదాయకమని సీఎస్డబ్ల్యూటీ ఐజీ భాస్కర్ సింగ్ రావత్ కొనియాడారు. 56 మంది పురుషుల్లో ఆమె ఒక్కరే మహిళ అని, ప్రతి పనిలోనూ ఆమె అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందన్నారు.
తాజా పరిణామాలతో మహిళలు ఈ కోర్సును ఎంచుకునేందుకు ముందుకొస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘అసాధారణంగా’ రాణించి వారికి.. స్నైపర్ కోర్సులో ఆల్ఫా, బ్రావో గ్రేడింగ్ లభిస్తుందని, అయితే సుమన్ సాధించిన ‘ఇన్ స్ట్రక్టర్ గ్రేడ్’కు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షను తీసుకుంటారని రావత్ వివరించారు. ఈ గ్రేడ్ ఆమెకు స్నైపర్ ఇన్స్ట్రక్టర్గా పోస్టింగ్ పొందడానికి అర్హత కల్పిస్తుంది.
“అసాధారణంగా రాణించిన ట్రైనీలకు ఆల్ఫా, బ్రావో గ్రేడింగ్ లభిస్తుంది. అయితే సుమన్ సాధించిన ‘ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ ‘కు ప్రత్యేక స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్ అయిన ఆమె ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తారు. కమాండో ట్రైనింగ్ తర్వాత ఈ కోర్సు అత్యంత కఠినమైనది’ అని రావత్ తెలిపారు.
More Stories
రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు
ఓట్ల కోసం నిప్పుతో కాంగ్రెస్ చెలగాటం
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు