రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. అన్ని విభాగాల్లో రఫ్ఫాడించిన టీమిండియా హ్యాట్రిక్ విజయంతో సిరీస్ కైవసం చేసుకుంది. దాంతో, స్వదేశంలో రికార్డు స్థాయిలో 17వ టెస్టు సిరీస్ ఖాతాలో వేసుకుంది. బజ్ బాల్ ఆటతో ప్రత్యర్ధులను వణికించిన ఇంగ్లండ్కు రాంచీలో భారత జట్టు తొలి సిరీస్ ఓటమిని రుచి చూపించింది.
తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో జట్టును ఒడ్డున పడేసిన అతడు గిల్తో కలిసి ఆరో వికెట్కు 72 పరుగులు జోడించాడు. బషీర్ బౌలింగ్లో ఫోర్, రెండు రన్స్ తీసిన జురెల్ టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించాడు. దాంతో, పన్నెండేండ్ల క్రింత 2-1తో సిరీస్ నెగ్గిన ఇంగ్లండ్పై రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది.
ఓవర్ నైట్ స్కోర్ 40తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ అనూహ్యంగా తడబడింది. బంతి టర్న్ కావడంతో బషీర్, హర్ట్లేల ధాటికి 16 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 84 పరుగుల వద్ద యశస్వీ జైస్వాల్(37 44 బంతుల్లో) వెనుదిరగగా ఫిఫ్టీ బాదిన రోహిత్ శర్మ(55 81బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్) హర్ట్లే బౌలింగ్లో ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్(0) డకౌట్ కావడంతో 100 పరుగులకే మూడు శలో జడేజా, గిల్లు నాలుగో వికెట్కు 71బంతుల్లో 20 రన్స్ జోడించడంతో 118/3 తో లంచ్కు వెళ్లిన భారత జట్టు.. ఆ తర్వాత రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఉప్పల్ టెస్టు ఓటమి తర్వాత పుంజుకున్న రోహిత్ బృందం సంచలన ప్రదర్శనతో వరుసగా మూడు మ్యాచుల్లో బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్కు చెక్ పెట్టింది.
More Stories
ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్కు కంగనా వీడ్కోలు
కేజ్రీవాల్ నిరసన పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్తత
ఆరు నెలల్లో భారత్ లో భాగం కానున్న ఆక్రమిత కాశ్మీర్