సోనియాకు సూట్‌కేసులు మోయాలన్న ఆలోచనే!

సోనియా గాంధీ ఫ్యామిలీకి సూ ట్‌కేసులు ఎలా మో యాలన్న ఆలోచన తప్ప హామీల అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దృష్టి లేదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అప్పుడే వ్యతిరేకత మొదలైందని కిషన్ రెడ్డి తెలిపారు. 
 
పార్టీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా నారాయణపేటలో పాల్గొంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుపరచలేక అయోమయానికి గురిచేసిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలను ఎప్పుడు అమలులోకి తీసుకొస్తౌరో కాంగ్రెస్ నేతలు చెప్పాలని, ఎన్ని లక్షల కోట్లు అవసరమో ఎలా సమకూర్చుకుంటారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. 
 
ఆర్‌టిసిలో మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు రావని, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఎప్పుడు నుంచి ఇస్తారని ప్రశ్నించారు. దేశంలో ముచ్ఛటగా మూడవసారి బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని, మళ్ళీ నరేంద్ర మోదీ  ప్రధానమంత్రి అవుతారని భరోసా వ్యక్తం చేశారు. అందుకు దేశ ప్రజలంతా ఆయన వైపు చూస్తున్నారని చెప్పారు. 
 
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణంలో 17 ఎం పి సీట్లలో గెలవడానికి పోటీ చేస్తున్నామని చెబుతూ బిఆర్‌ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అజెండా లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలో కూడా తమ పార్టీకి అత్యధికంగా ఎంపి సీట్లు రానున్నాయని చెప్పారు. 
 
కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని, ఆ పార్టీలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లాలో ధన్వాడ, మరికల్ ప్రాంతాల్లో విజయ సంకల్ప యాత్ర లో సైతం కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, మాజీ ఎంపి ఎపి జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.