అమెరికాలో ఎన్ఆర్ఐ జంట‌, క‌వ‌ల పిల్ల‌లు అనుమానాస్పద మృతి

అమెరికాలో ఉన్న భార‌తీయ కుటుంబం అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందింది. కాలిఫోర్నియాకు సమీపంలోని శాన్ మటియోలో తమ ఇంట్లో వారు చనిపోయి ఉండగా ఈనెల 13న పోలీసులు కనుగొన్నారు. కేర‌ళ‌కు చెందిన 42 ఏళ్ల ఆనంద్ సుజిత్ హెన్రీ, 40 ఏళ్ల అలిస్ ప్రియాంకా, వారి ఇద్ద‌రు క‌వ‌ల‌లు నోహ‌, నైతాన్‌  కాలిఫోర్నియాలోని అపార్ట్‌మెంట్‌లో మృతిచెందారు. 
 
ఆ కుటుంబానికి చెందిన బంధువు ఈ స‌మాచారాన్ని పోలీసుల‌కు అంద‌జేశారు.  బాత్రూమ్‌లో ప‌డి ఉన్న ఆనంద్‌, అలిస్ జంట‌కు తూటా గాయాలు ఉన్నాయి. ఇద్ద‌రు పిల్ల‌ల మృత‌దేహాలను బెడ్‌రూమ్‌లో గుర్తించారు. వారి మరణానికి కారణం తెలియరాలేదు. అయితే ఏ కార‌ణంగా వాళ్లు చ‌నిపోయార‌న్న విష‌యం ఇంకా నిర్ధార‌ణ కాలేదు. ఈ కేసులో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.
 
ఆ ఇంట్లో నుంచి 9ఎంఎం పిస్తోల్‌ను, లోడ్ చేసిన మ్యాగ్జిన్‌ను రిక‌వ‌రీ చేశారు. బాత్రూమ్ నుంచి వాటిని సీజ్ చేశారు. 2020లోనే ఆ జంట ఇళ్ల‌ను 2 మిలియ‌న్ల డాల‌ర్లు పెట్టి కొనుగోలు చేశారు. మ‌ర్డ‌ర్-సూసైడ్ లాగా ఈ ఘ‌ట‌న క‌నిపిస్తున్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  కేర‌ళ‌కు చెందిన ఆ కుటుంబం దాదాపు 9 ఏళ్ల నుంచి అమెరికాలోనే నివ‌సిస్తున్న‌ది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఆనంద్‌, సీనియ‌ర్ అన‌లిస్టుగా అలిస్ పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం న్యూజెర్సీ నుంచి సాన్ మాటియో కౌంటీకి వాళ్లు వ‌ల‌స‌వ‌చ్చారు. వాళ్ల‌కు స్నేహ‌పూర్వ‌క‌మైన వ్య‌క్తులుగా గుర్తింపు ఉన్న‌ది.