ఇటీవల జమ్ముకశ్మీర్ లోని దర్యాప్తు సంస్థలు ఒక ఉగ్రవాద కుట్రను చేధించారు. ఆ సందర్భంగా ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఐదు ఏకే రైఫిల్స్ (షార్ట్), ఐదు ఏకే మ్యాగజైన్లు, 16 షార్ట్ ఏకే రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి వచ్చిన సమాచార ప్రకారం లష్కరే తోయిబాలో రియాజ్ అహ్మద్ రాథర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది.
దాంతో, వారు వెంటనే ఢిల్లీలోని ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందించారు. వారికి, రియాజ్ పరారీలో ఉన్నాడని తెలిసింది. అలాగే, అతడు మంగళవారం తెల్లవారు జామున న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు వస్తాడని కూడా సమాచారం అందింది. దాంతో, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మోహరించారు.
తెల్లవారుజామున ఎగ్జిట్ గేట్ నంబర్-1 నుంచి పారిపోయేందుకు యత్నిస్తుండగా రియాజ్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రియాజ్ అహ్మద్ రాథర్ కు ఈ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని లష్కరే తోయిబా ఉగ్రవాదులు మంజూర్ అహ్మద్ షేక్ అలియాస్ షకూర్, ఖాజీ మొహమ్మద్ ఖుషాల్ పంపించేవారు.
వీరిద్దరూ నియంత్రణ రేఖ సరిహద్దు వెంబడి లష్కరే తోయిబా కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. రియాజ్, అతని స్నేహితుడు అల్తాఫ్ 2023 జనవరి 31న భారత సైన్యం నుంచి రిటైర్ అయ్యారు. రియాజ్ వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, ఒక సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు.
More Stories
మణిపూర్లో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
ఇక ఏడాదిలో రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు
టిఎంసి నాయకుడి ఇంట్లో ఆయుధాలు, బాంబులు