* కాంగ్రెస్ నాయకత్వంపై నిప్పులు చెరిగిన మమతా
బెంగాల్లోని ముర్షిదాబాద్లో శుక్రవారం జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. 300 సీట్లలో మీరు (కాంగ్రెస్) కనీసం 40 స్ధానాలైనా గెలుస్తారనేది అనుమానమే, అలాంటిది మీకెందుకింత అహంకారమని దీదీ నిలదీశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బెంగాల్లో అడుగుపెట్టినా తనకు సమాచారం ఇవ్వలేదని, ప్రభుత్వ యంత్రాంగం నుంచి తనకు ఈ విషయం తెలిసిందని ఆమె తెలిపారు.
”300 సీట్లలో పోటీ చేయమని కాంగ్రెస్కు చెప్పా. వాళ్లు వినలేదు. ఇప్పుడు ముస్లిం ఓటర్ల కోసం రాష్ట్రానికి (బెంగాల్) రెక్కలు కట్టుకుని వచ్చారు. 300 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తే కనీసం 40 స్థానాలైనా గెలుచుకుంటుందో లేదో అనుమానమే. ఇక్కడ రెండు సీట్లు (లోక్సభ) ఇస్తామని ఆఫర్ చేశాను. కానీ వాళ్లు మరిన్ని కావాలని అడిగారు. అప్పుడు ఒకే మాట చెప్పాను. 42 సీట్లలో పోటీ చేయమని అన్నాను. తోసిపుచ్చారు. అప్పట్నించి వాళ్లతో మాటలు జరిపిందే లేదు” అని మమత తెలిపారు.
‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ కోసం పశ్చిమబెంగాల్లోకి కాంగ్రెస్ అడుగుపెట్టినా ‘ఇండియా’ కూటమి భాగస్వామిగా తనకు కనీస సమచారం ఇవ్వలేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం నుంచే తనకు ఆ విషయం తెలిసిన మమత చెప్పారు. ర్యాలీ సజావుగా సాగేలా చూడాలని డెరిక్ ఒబ్రెయిన్ను కోరారని, అలాంటప్పుడు బెంగాల్ రావాల్సిన అవసరం ఏముందని ఆమె నిలదీశారు.
కాంగ్రెస్ యూపీ, రాజస్ధాన్లో గెలిచే పరిస్ధితి లేదని పేర్కొంటూ అలహాబాద్, వారణాసిలో గెలిచి మీ పార్టీ సత్తా చాటాలని ఆమె కాంగ్రెస్కు సవాల్ విసిరారు. రాహుల్ బీడీ కార్మికులతో ఫొటో దిగిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక్కసారి కూడా టీ దుకాణానికి వెళ్లని వారు ఇప్పుడు బీడీ కార్మికులతో కూర్చుంటున్నారని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం