మా తాత వారసత్వంగా ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని, పదేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నా ప్రయోజనం లేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. వ్యాపారం, రాజకీయం రెండింటిని సమన్వయం చేసుకోలేకపోతున్నానని… ఈ క్రమంలోనే రాజకీయాలను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
“ప్రస్తుతం రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. ఇకపై పూర్తిగా వ్యాపారాలపై దృష్టి పెడుతాను. 10 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేశాను. తక్కువ సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చి విజయవంతం అయ్యాను. వచ్చే ఎన్నికల్లో కూడా నిలబడితే గెలుస్తాను. కానీ పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నాను” అని తెలిపారు.
అయితే, మళ్లీ అవకాశం వస్తే పోటీ చేస్తానని, మళ్లీ రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధంగా ఉంటానని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మంచిగా ఉంటే బాగుండేదని పేర్కొంటూ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారవేత్తలు రాజకీయాల్లో వస్తే స్వేచ్ఛంగా మాట్లాడే అవకాశం ఉండాలని చెబుతూ కానీ ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి పరిస్థితులు లేవని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే వ్యాపార సంస్థలపై నిఘా పెడుతున్నారని ఆరోపించారు.
“ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల విస్తరణకు ఇబ్బందులు కలిగాయి. దాంతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నెలకొల్పాం. విదేశాల్లో పరిశ్రమలను విస్తరిస్తున్నాం. రాజకీయాల్లో నుంచి వైగొలిగే పరిస్థితి వస్తుందని అనుకోలేదు. రాజకీయం, వ్యాపారం రెండు చేయొచ్చని భావించాను. ప్రస్తుత పరిస్థితుల్లో రెంండింటికి న్యాయం చేయలేను. నన్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయి. అయినప్పటికీ తట్టుకుని నిలబడ్టాను” అంటూ చెప్పుకొచ్చారు.
More Stories
33 చోట్ల హింసాత్మక ఘటనలపై సిట్ నివేదిక
విశాఖలో నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!
మంత్రికి వత్తాసు పలికారని కడప పోలీసులకు చార్జ్ మెమోలు