హైదరాబాద్ నగరంలోని ప్రముఖ యాత్రాకేంద్రాంలలో ఒకటైన రామోజీ ఫిల్మ్ సిటీ లో ఘోర ప్రమాదం సంభవించింది. క్రేన్ కూలి పడడంతో విస్టెక్స్ కంపెనీ సిఇఒ సంజయ్ షా మృతి చెందారని సమాచారం. చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలయ్యాయి.
గురువారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం జరిగింది. ఇందుకు అమెరికాలో ఉంటున్న కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ సంజయ్ షా హాజరయ్యారు. ఆయనే కాకుండా కంపెనీకి చెందిన పలువురు ముఖ్యులు ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన సెట్ పైకి క్రేన్ ద్వారా అతిధిలను కిందకు దించుతుండగా వైర్లు తెగిపోయాయి. దీంతో పలువురు కంపెనీ ప్రతినిధులు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సీఈవో సంజయ్ షా తీవ్రంగా గాయపడగా, ఆయన్ను మలక్ పేటలోని యశోదా ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న క్రమంలో శుక్రవారం ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఇక ఈ ప్రమాదంలో కంపెనీ ఛైర్మన్ విశ్వనాథ్ రాజ్ తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ మెంట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
More Stories
తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం
పట్టభద్రుల ఎంఎల్సికి నోటిఫికేషన్
వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు కాంగ్రెస్ నేతల అరెస్ట్