* వర్ధమాన దేశాల్లో 60 శాతం ఉద్యోగాలకు ముప్పు
కృత్రిమ మేథతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా హెచ్చరించారు. కొన్ని రకాల ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఇంకోవైపు ఉత్పాదకతను గణనీయంగా పెంచి ప్రపంచవృద్ధికి దోహదం చేసే అవకాశాలనూ ఈ అత్యాధునిక సాంకేతికత తెచ్చిపెడుతుందని ఆమె చెప్పారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి విశ్లేషణ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు కృత్రిమ మేధస్సు ద్వారా ప్రభావితమవుతాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, తక్కువ ఆదాయ దేశాల కంటే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలపైనే కృత్రిమ మేధ ప్రభావం అధికంగా ఉంటుంది.
కృత్రిమ మేధ ప్రతికూల ప్రభావాలపై క్రిస్టాలినా జార్జివా ఒక బ్లాగ్ పోస్ట్ లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చాలా సందర్భాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఆదాయ, సామాజిక అసమానతలు ఏఐ కారణంగా మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. దీని ప్రభావంతో సమాజంలో ఉద్రిక్తతలు ప్రబలడానికి ముందే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
ఇందుకోసం ప్రభుత్వాలు సమగ్ర సామాజిక భద్రతా పథకాలను ప్రారంభించాలని ఆమె చెప్పారు. ఏఐతో ప్రభావితమయ్యే అవకాశమున్న కార్మిక వర్గాలకు రీట్రైనింగ్ కార్యక్రమాలను అమలు చేయాలని ఆమె కోరారు. కాగా, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో కృత్రిమ మేథ 60 శాతం ఉద్యోగాలపై ప్రభావం చూపుతుంది.
అభివృద్ధి చెందుతున్న, తక్కువ ఆదాయ దేశాలపై దీని ప్రభావం కొంత తక్కువగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో, కృత్రిమ మేథ అనుకూల, వ్యతిరేక వాదనలు పెరుగుతున్న నేపథ్యంలో, పలు అంతర్జాతీయ వేదికలపై దీనిపై లోతైన చర్చలు జరుగుతున్నాయి.
బజ్ ఫీడ్ సంస్థ తన కంటెంట్ క్రియేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకునే దిశగా ప్రణాళికలను ప్రకటించింది. ఈ ప్రణాళిక వల్ల ఆ సంస్థలోని ప్రధాన వార్తా విభాగం మూత పడింది. అలాగే, 100 మందికి పైగా సిబ్బందిని తొలగించారు. డిసెంబర్ లో యూరోపియన్ యూనియన్ కృత్రిమ మేధకు రక్షణ కల్పించే చట్టంపై తాత్కాలిక ఒప్పందానికి వచ్చింది. ఇదిలావుండగా, కృత్రిమ మేధస్సుపై అమెరికా ఫెడరల్ రెగ్యులేటరీ వైఖరిని ఇంకా అంచనా వేస్తోంది.
More Stories
జులైలో వందే మెట్రో రైల్ ట్రయల్ రన్!
బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
ఐటీ రంగంలో కొత్త నియామకాలపై నీలినీడలు