వీవీప్యాట్లపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వ్యక్తం చేసిన ఆందోళనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. జైరామ్ రమేశ్ లేవనెత్తిన అనుమానాల్లో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అంశాలేవీ లేవని పేర్కొంది. వీవీప్యాట్ స్లిప్లను 2013లో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని గుర్తుచేసింది.
ఈవీఎంల వినియోగంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్కు ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ శర్మ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణ నియమావళి 1961లోని 49ఎ, 49ఎం నిబంధనల కింద వీవీప్యాట్లను ఆగస్టు 14, 2013లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని అందులో పేర్కొన్నారు.
ఈవీఎంల వినియోగంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేలా అందుబాటులో ఉంచిన వివరాలు స్పష్టత నిస్తాయని తెలిపారు. అయితే, ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలున్నాయని విపక్ష కూటమి ‘ఇండియా’ ఆరోపిస్తున్నది. వీవీప్యాట్ స్లిప్లను ఓటర్లకు అందించాలని, ఆ తర్వాత వాటిని 100 శాతం లెక్కించాలని డిమాండ్ చేస్తున్నది.
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన `ఇండియా’ కూటమి సమావేశంలోనూ ఇదే అంశంపై ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం `ఇండియా’ కూటమి బృందానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ కేంద్ర ఎన్నికల సంఘానికి డిసెంబర్ 30న లేఖ రాశారు. అందుకు ఈసీ ఇవాళ బదులిచ్చింది.
More Stories
మణిపూర్లో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
ఇక ఏడాదిలో రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు
టిఎంసి నాయకుడి ఇంట్లో ఆయుధాలు, బాంబులు