* ప్రధానిని సిబిఐ దర్యాప్తు కోరిన పవన్ కళ్యాణ్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం రూ.35,141 కోట్ల నిధులను వెచ్చించిందని, అందులో భారీగా అవినీతి జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. పేదల ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై దృష్టి సారించి సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కల్యాణ్ లేఖ రాశారు.
భారీగా నిధులు పక్కదారి పట్టాయని, పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు అయితే ప్రభుత్వం మాత్రం రూ.91,503 కోట్లుగా చెబుతుండడంతో అనేక సందేహాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పిందని గుర్తు చేశారు.
కానీ 29,51,858 మంది మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారని, అయితే వాస్తవంలో 21,87,985 మందికే పట్టాలకు లబ్ధిదారులను గుర్తించారని తెలిపారు. మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,005 జగనన్న లే అవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారని చెప్పారు.
పథకం పేరుతో వైఎస్సార్సీపీ నేతలు భారీగా లాభపడ్డారని పవన్ లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపేసింది. పీఎంఏవై (అర్బన్, రూరల్), బేజేఎం, ఎంజీఎన్ఆర్ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను ఏపీ ప్రభుత్వాన్ని పథకానికి వాడుకున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం చెబుతున్న గణాంకాలకు, చేసిన పనులకు చాలా తేడా కనిపిస్తున్నట్టు ఆయన చెప్పారు. మొదట్లో కేవలం భూ సేకరణ కోసం రూ.35,151 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పిన లెక్కకు, పత్రికా ప్రకటనలో చెప్పిన లెక్కకు చాలా తేడా ఉందంటూ గృహ నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం గత అయిదు రాష్ట్ర బడ్జెట్ లలో రూ.23,106.85 కోట్లు మేర కేటాయించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
అయితే దీనిలో వ్యయం చేసింది మాత్రం 1 కేవలం రూ.11,358.87 కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై (అర్బన్) పథకం ద్వారా రాష్ట్రానికి విడుదల చేసింది రూ.14,366.08 కోట్లు అని గుర్తు చేశారు. ఈ మొత్తం పథకంలో ఉన్న అన్ని విషయాలను గమనించి. ఈ పథకం అమలు తీరుపై సీబీఐతో పాటు ఈడీ విచారణ చేపడితే పేదల గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్నా మరింత లోతైన అవినీతి బయటపడే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వేల కోట్లు ప్రజా ధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో బయటపడుతుంది ప్రధానికి రాసిన లేఖలో పవన్ పేర్కొన్నారు.
More Stories
విద్యా భారతి విజ్ఞాన కేంద్రంకు డా. భగవత్ తో ప్రారంభోత్సవం
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల