విశాఖకు చెందిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ బుధవారం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వంశీకృష్ణ యాదవ్ కు పవన్ కల్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ జనసేన పార్టీలోకి రావడంతో తనకు పార్టీ మారినట్టుగా అనిపించడంలేదు, సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో తాను పవన్ అన్న ఆధ్వర్యంలో ప్రజారాజ్యం యువజన విభాగంలో పనిచేశానని గుర్తు చేస్తూ, ఇప్పుడు మళ్లీ అన్న నేతృత్వంలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని వెల్లడించారు.
తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానిగానే ఉన్నానని, ఇప్పటికీ పవన్ కల్యాణ్ సినిమా విడుదలైతే మొదటి రోజే సినిమా చూస్తానని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో, విశాఖలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు, పవన్ కల్యాణ్ ను సీఎంగా చేసేందుకు సర్వశక్తులు ధారపోస్తాను అని తెలిపారు.
వంశీకృష్ణ యాదవ్ జనసేనలోకి రావడం పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు. వంశీకృష్ణ యాదవ్ చాలా బలమైన నాయకుడు అని కొనియాడారు. ఇది ఆరంభం మాత్రమేనన్న పవన్ కళ్యాణ్.. భవిష్యత్తులో తమ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు.స్వల్ప తేడాతో విశాఖ తూర్పు నుంచి ఓడిపోయి, మళ్లీ ఎమ్మెల్సీగా గెలిచారని వివరించారు.
More Stories
నగదు బదిలీకి జగన్ కు హైకోర్టులో అనుమతి
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 23 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
సంక్షేమ పథకాల నగదు బదిలీ ఎన్నికలయ్యే వరకూ వాయిదా