మిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం బాధాకరం. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయనో లెజెండ్. తన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజా సేవలో నిమగ్నమయ్యారని ప్రధాని తెలిపారు.
తమిళనాడు రాజకీయాలను విజయకాంత్ ఎంతో ప్రభావితం చేశారు. నాకు మంచి మిత్రుడు.. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. విజయకాంత్ కుటుంబానికి, అభిమానులకు, అనుచరులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కాగా, తమిళ నటుడు విజయకాంత్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ రంగాల్లో విజయకాంత్ విశేష సేవలందించి, లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను అని రాహుల్ తన ట్వీట్లో తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళ స్టార్ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ కు నివాళులర్పించారు. చెన్నైలోని విరుగంబాక్కంలోని నటుడి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి కెప్టెన్ భౌతికకాయంపై పూలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా స్టాలిన్ వెల్లడించారు.

More Stories
‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్ ‘అన్సార్ ఇంటీరియం’
రైతుల ప్రయోజనాలపై రాహుల్, అమిత్ షా మాటల యుద్ధం
9న స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్