“ఇప్పటికే గర్భీణులకు పోషకాహారం అందడం లేదు. అంగన్వాడీల సమ్మె వల్ల పిల్లలకు బాలామృతం అందడం లేదు. పోషకాహారం అందకుంటే గర్భిణులు, పిల్లలు ఏమవుతారు..? సమ్మె విరమించకుంటే మేం ప్రత్యామ్నాయాలకు వెళ్లక తప్పదు” అని స్పష్టం చేశారు. అంగన్వాడీ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగానే ఉందని చెబుతూ వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ మినహా అన్ని డిమాండ్లను మేం ఆమోదించామని వెల్లడించారు.
వేతనాల పెంపునకు ఇది సరైన సమయం కాదని, గ్రాట్యుటీ తమ పరిధిలోకి రాదని అంగన్వాడీలకు వివరించామని తెలిపారు. సంక్రాంతి తర్వాత మళ్లీ చర్చిద్దామని చెప్పామని, పలు డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చామని చెప్పారు. అయితే, ఈ చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతరాహితంగా వ్యవహరించిందని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి చేయాలని మూడు సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించారు. కొత్త విషయం ఒకటి కూడా మాట్లాడలేదని పేర్కొంటూ పాత విషయాల్ని చెబుతూ జీతాలు పెంచేటువంటి విషయాన్ని 15 రోజుల తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడతావని చెప్పి చర్చల్ని వాయిదా వేయాలని కోరారని వారు విస్మయం వ్యక్తం చేశారు.
గత సమావేశం తర్వాత పది రోజులు సమయం తీసుకుని కూడా ఇప్పుడు దాకా ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడలేదని వారు ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఒంటరి మహిళలు లక్ష మంది పైగా సమ్మె చేస్తుంటే ఈ విధమైనటువంటి వైఖరి తీసుకోవడం సరైనదికాదంటూ మహిళలపట్ల ప్రభుత్వం వైఖరి దుర్మార్గమైనదని మండిపడ్డారు.

More Stories
కర్నూలు బస్సు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం
అమరావతికి ప్రపంచ బ్యాంకు మరో రూ 1700 కోట్లు