మరోవంక, తెలంగాణలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వివిధ అనారోగ్య కారణాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మరణించారు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉస్మానియా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీలో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో వ్యక్తి కూడా తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాడు. అతను కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
కాగా.. ఆ ఇద్దరు రోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఇద్దరు రోగులు కూడా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి సుపరిండెంట్ నాగేంద్ర పేర్కొన్నారు. తెలంగాణలో సోమవారం 989 నమూనాలను పరీక్షించగా 10 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ఒక బులెటిన్లో తెలిపింది.
కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా రికవరీల సంఖ్య 8,40,392కి చేరుకుంది. కరోనా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తంకరోనా కేసులు 8,44,558. రాష్ట్రంలో చికిత్స పొందుతున్న లేదా ఐసోలేషన్లో ఉన్న మొత్తం కేసుల సంఖ్య 55. రాష్ట్రంలో సోమవారం ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదని బులెటిన్ తెలిపింది.
రాష్ట్రంలో కేసు మరణాల రేటు 0.49 శాతం, కోలుకునే రేటు 99.51 శాతంగా ఉంది. ఆదివారం వరకు దేశంలో మొత్తం 63 కరోనా సబ్-వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. గోవాలో అత్యధిక కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు సోమవారం తెలిపాయి. అయితే, ఇప్పటివరకు నివేదించిన కేసుల్లో క్లస్టరింగ్ ఏదీ లేదు. జేఎన్.1 సబ్వేరియంట్లోని అన్ని కేసులు తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నాయని అధికారులు తెలిపారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు