కాంగ్రెస్ హస్తం..ఉగ్రవాద నేస్తం..!

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిగిలో వచ్చే ఏడాది జనవరి 6,7,8 తేదీల్లో జరిగే ఇస్లామిక్ అతివాద సంస్థ ” తబ్లిగీ జమాత్” సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్ధిక సహాయం చేయటం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఈ సమావేశాల నిర్వహణకు ఏకంగా రూ. 2.45 కోట్లను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న అనేక ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపుల్లో రిక్రూట్‌మెంట్‌కు “పైప్‌లైన్”‌గా పని చేస్తున్న “తబ్లిగీ జమాత్‌”కు తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇవ్వటం ఏంటనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, హిందూ సనాతన ధర్మంపై దాడి చేయటమే కాకుండా.. ఇస్లామిక్ మత ఛాందసవాదాన్ని పెంచి పోషిస్తోందనే ముద్ర తబ్లిగీ జమాత్‌పై ఉంది. అనేక దేశాల్లో ఈ సంస్థ నిషేధానికి కూడా గురైంది. అటువంటి సంస్థకు ముందు, వెనుకా చూడకుండా.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2.45 కోట్ల రూపాయలను అప్పనంగా కట్టబెట్టటాన్ని.. హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకుని నిధుల విడుదలకు బ్రేక్ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భజరంగ్ దళ్, భారతీయ జనతాపార్టీ తో పాటు అనేక హిందూ సంఘాలు ఇప్పుడు ముక్త కంఠంతో “తబ్లిగీ జమాత్” ఉదంతంపై గళమెత్తుతున్నాయి. అయితే.. హిందూ సంఘాల ఆందోళనలో సహేతుకమైన కారణాలే కనిపిస్తున్నాయి. “తబ్లిగీ జమాత్” సంస్థ పూర్వ నేపథ్యం గురించి నిశితంగా పరిశీలించిన వారెవరూ.. ఈ సంస్థకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. ఎందుకంటే.. ఇది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ కాదు. సమాజానికి మంచి చేస్తున్న సంస్థ అంతకన్నా కాదు. కేవలం.. వ్యక్తిని కేంద్రంగా చేసుకుని ఇస్లామిక్ మత ఛాందసవాదాన్ని నూరి పోయటమే తబ్లిగీ జమాత్ లక్ష్యం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రజలను ఇస్లాంలోకి తీసుకురావటం.. ముస్లిం సామ్రాజ్యాలను స్థాపించటమే వీరి ప్రధాన అజెండా. ఈ క్రమంలోనే.. “తబ్లిగీ జమాత్‌”లో ప్రేరణ పొందిన అనేక మంది ముస్లిం యువకులు ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపుల్లో మిలిటెంట్లుగా చేరిపోతున్నారు. మరి అటువంటి సంస్థకు.. తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కేటాయించటం అంటే.. ఈ ప్రభుత్వ పెద్దల మెదళ్ళు పని చేస్తున్నాయా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తం అవున్నాయి.

అల్లా మాటలను బోధించే వారిని ఇస్లాంలో “తబ్లిగీ”లు అని పిలుస్తారు. జమాత్ అంటే సంస్థ అని అర్ధం. తబ్లిగీ జమాత్ అంటే సంక్షిప్తంగా అల్లా మాటలను బోధించే సంస్థ అని చెప్పుకోవచ్చు. వీరందరూ సమావేశమయ్యే స్థలాన్ని మర్కజ్ అంటారు. 1926 లో హర్యాణాలోని “మేవాట్” ప్రాంతంలో “మౌలానా ఇలియస్ కాంద్లావి” అనే ముస్లిం మత గురువు ఈ సంస్థను ప్రారంభించాడని తెలుస్తోంది. ఆ తరువాత అతను ఢిల్లీ సమీపంలోని దర్గా హజ్రత్ నిజాముద్దీన్‌కు తన మకాంను మార్చాడు. అక్కడి నుంచి క్రమ క్రమంగా దేశం మొత్తం ఈ సంస్థను విస్తరించాడు. 1947 దేశ విభజన నాటికి అటు పాకిస్థాన్, సౌదీ అరేబియా, ఇటు ప్రస్తుత బంగ్లాదేశ్, దక్షిణ ఆసియాలోనే అనేక దేశాలకు తబ్లిగీ జమాత్ మత ప్రచార కార్యకలాపాలు విస్తరించాయి. 1975 నాటికి ఆగ్నేయ ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఫ్రాన్స్, యూకే తదితర దేశాలకు తబ్లిగీ జమాత్ విస్తరణ కొనసాగింది. 2006 నాటికి ఫ్రాన్స్‌లోనే లక్ష మందికి పైగా యాక్టివ్ సభ్యులను కలిగిన సంస్థగా తబ్లిగి జమాత్ ఎదిగిందంటే.. ఈ ఇస్లామిక్ అతివాద గ్రూపు ఏ స్థాయిలో విస్తరించిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 150కు పైగా దేశాల్లో 80 మిలియన్ల వరకు అనుచరులు తబ్లిగీ జమాత్‌లో ఉన్నారనే అంచనాలు ఉన్నాయి.

అయితే..తబ్లిగీ జమాత్ సభ్యులు “ఖురూజ్” (మతమార్పిడి పర్యటనలు) చేస్తూ ఉంటారు. నెలకు 10 రాత్రులు, సంవత్సరానికి కనీసం 120 రోజులు దీనికి కేటాయిస్తారు. స్థానికంగా ఉండే మసీదులు, దర్గాలను కేంద్రంగా చేసుకుని తబ్లిగీ జమాత్ తన కార్యకలాపాలను చాప కింద నీరులా కొనసాగిస్తూ ఉంటుంది. ముస్లిం యువతీ, యువకుల్ని ఆకర్షించటం, వారికి బ్రెయిన్ వాష్ చేయటం , మత ఛాందసవాదాన్ని నూరి పోయటం వంటివి వీరి దైనందిన కార్యకలాపాల్లో భాగంగా ఉంటాయి. అలాగే ప్రతీ ఏటా “ఇజ్తేమా” అని పిలిచే వార్షిక సమావేశాలను తబ్లిగీలు నిర్వహిస్తారు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ అనుచరులను ఆహ్వానిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు లక్షలాది మంది తబ్లిగీలు వస్తుంటారు. వచ్చే జనవరి నెలలో వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించతలపెట్టిన తబ్లిగీ జమాత్ వార్షిక సమావేశాలను సైతం మనం ముందుగా చెప్పుకున్న అజెండాలో భాగంగానే నిర్వహిస్తున్నారు. అయితే..ఈ సమావేశాలు పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 2.45 కోట్ల రూపాయలను ఈ మీటింగ్స్‌ కేటాయించటం పట్ల సామాన్య ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావటానికి తబ్లిగీ జమాత్ నేపథ్యమే ప్రధాన కారణంగా నిలుస్తోంది. తబ్లిగీ సంస్థ బోధనలు, మూల సిద్ధాంతాలు ఇస్లామిక్ రాడికల్ గ్రూపుల్లో చేరటానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇక్కడ మానసికంగా సిద్ధమైన అనేక మంది ఆ తరువాత మతోన్మాదులుగా, టెర్రరిస్టులుగా మారుతూ ఉంటారని అమెరికన్ “ఫారిన్ పాలసీ కౌన్సిల్” పేర్కొంది. పలు దేశాలకు చెందిన అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు తబ్లిగీ జమాత్‌ను “ట్రాన్స్-నేషనల్ ఇస్లామిస్ట్ నెట్‌వర్క్”గా పేర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపుల్లో జాయిన్ అయ్యే 80 శాతం మందికి పైగా మిలిటెంట్లపై తబ్లిగీ జమాత్ ప్రభావం ఉంటుందనే అంచనాలూ ఉన్నాయి. ఆల్ ఖాయిదా, లష్కర్ ఏ తోయిబా, జైషే మహ్మద్, ఐసిస్ వంటి అనేక ఉగ్రవాద సంస్థల్లో తబ్లిగీ నుంచి ట్రైన్ అయిన మిలిటెంట్లు జాయిన్ అవుతూ ఉంటారు. ఇది నిరంతరం సాగే ప్రక్రియలా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇస్లామిక్ టెర్రరిజం వ్యాప్తికి ఓ పైప్‌లైన్ గా.. ముఖద్వారంగా తబ్లిగీ జమాత్ పని చేస్తుందనటానికి అనేక ఆధారాలను ప్రపంచ దేశాలు చూపిస్తున్నాయి. ఈ కారణంతోనే ఇరాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, కజకిస్తాన్, రష్యా మరియు సౌదీ అరేబియా తదితర దేశాలు ఈ సంస్థపై నిషేదాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలు అంటే విశ్వాసం లేని ఈ సంస్థ.. అల్లా రాజ్య స్థాపన కోసమే పని చేస్తూ ఉంటుంది. మనదేశ భద్రతకు, హిందూ సనాతన ధర్మానికి పెను సవాల్ విసురుతోంది.

2020 కరోనా సమయంలో మలేషియాలో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశం వల్ల కరోనా కేసులు ఎంతలా పెరిగాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇండియా, ఇండోనేషియా , సింగపూర్ , థాయ్‌లాండ్ , కంబోడియా , వియత్నాం , ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్, శ్రీలంక సహా అనేక ఇతర దేశాల్లో వేలాదిగా కరోనా కేసులు పెరిగి పోయాయి. ఏకంగా ఆగ్నేయ ఆసియా మొత్తం కరోనా గుప్పెట్లో చిక్కు కోవటానికి తబ్లిగీ జమాత్ సమావేశాలు కారణం అయ్యాయనే విమర్శలు ఉన్నాయి. అంతే కాదు.. కరోనా వ్యాప్తి సమయంలో మహారాష్ట్రలోని వాసాయిలో తబ్లిగీ జమాత్ సమావేశాలకు ప్లాన్ చేశారు. అయితే.. ప్రభుత్వం అంగీకరించక పోవటంతో ఢిల్లీలోని నిజాముద్దీన్ వెస్ట్ ప్రాంతంలో “మర్కజ్ మసీదు” ప్రాంగణంలో తబ్లిగీ సమావేశాలను నిర్వహించారు. టూరిస్టు వీసాల మీద వచ్చిన అనేక మంది ముస్లింలు ఈ సమావేశాల్లో పాల్గొనటమే కాకుండా.. భారతదేశంలో కరోనా మహమ్మారి మరింత వ్యాపించటానికి కారకులయ్యారు. సుమారు 22 వేల మందికి పైగా తబ్లిగీలను భారత ప్రభుత్వం క్వారంటైన్‌కు పంపిందంటే.. కరోనా వ్యాప్తిలో వీరి పాత్ర ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.