రాబోయే నాలుగైదేళ్లలో కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. రద్దీకి అనుగుణంగా ట్రైన్లను అందుబాటులో ఉంచడంతో పాటు ట్రాక్స్ బలోపేతం, సేఫ్టీ టెక్నాలజీని మెరుగుపరుచనున్నది. ప్రస్తుతం రైల్వేశాఖ నిత్యం 10,754 ట్రిప్స్ నడుపుతుండగా వెయిటింగ్ లిస్ట్ను తగ్గించేందుకు మరో మూడువేల ట్రిప్స్ పెంచాలని ప్రణాళికలు వేస్తున్నది.
వాస్తవానికి కరోనా మహమ్మారి ముందటితో పోలిస్తే ప్రస్తుతం రైల్వేశాఖ 568 ట్రిప్పులను అదనంగా నడిపిస్తున్నది. ఏటా దాదాపు 700 కోట్ల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుతుండగా, 2030 నాటికి వెయ్యికోట్లకు చేరనున్నదని రైల్వేశాఖ అంచనా వేస్తున్నది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రైల్వేశాఖకు రూ.2.4లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించగా, ఇందులో 70 శాతం నిధులను వినియోగించినట్లు రైల్వే మంత్రి తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 5 వేల నుంచి 6 వేల కిలోమీటర్ల కొత్త ట్రాక్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రోజుకు 14 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ వేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో సగటున రోజుకు 16 కిలోమీటర్ల ట్రాక్ల నిర్మాణం జరుగుతుందని అశ్విని వైష్ణవ్ వివరించారు.
More Stories
చైనాలో ఆర్థిక సవాళ్లు నిజమేనన్న జిన్పింగ్
ఏప్రిల్లో గరిష్ట స్థాయికి చేరిన జీఎస్టీ వసూళ్లు
బాబా రాందేవ్కు సుప్రీంకోర్టు ప్రశంసలు