విద్యుత్ వినియోగంలో 9 శాతం పెరుగుదల

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ వినియోగం 9  శాతం పెరుగుదల నమోదైంది. ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య దేశంలో మొత్త విద్యుత్‌ వినియోగం 1099.90 మిలియన్ యూనిట్లుగా రికార్డయింది. గతేడాది ఇదే సమయంలో విద్యుత్‌ వినియోగం 1010.20 బిలియన్ యూనిట్లుగా ఉన్నది.  2021-22 సంవత్సరంలో ఏప్రిల్- నవంబర్ మధ్య కాలంలో మొత్తం వినియోగం 916 బిలియన్ యూనిట్లుగా ఉంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వినియోగం 1504.26 బిలియన్ యూనిట్లు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1374 బిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ.  ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో విద్యుత్‌ వినియోగం 9శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థలో భూమ్‌ కారణమని ఇంధనరంగ నిపుణులు పేర్కొటున్నారు.
2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23లో దేశంలో విద్యుత్ వినియోగం 50.8 శాతం పెరిగిందని కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ఇటీవల లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.  2013-14లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 136 గిగావాట్లు కాగా, 2023లో ఈ డిమాండ్ 243 గిగావాట్లకు పెరిగింది. మంత్రి మాట్లాడుతూ సామర్థ్యాన్ని 194 గిగావాట్లకు పెంచాం.. దీంతో పెరుఉతున్న విద్యుత్‌ డిమాండ్‌తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.
ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుకుంటుందని ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొంది.  అయితే, ఏప్రిల్- జూలైలో కురిసిన అకాల వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ కాస్త తక్కువగా ఉండడంతో ఇప్పటికీ ఆశించిన స్థాయి కంటే తక్కువగానే ఉన్నది. గత జూన్‌లో దేశంలో విద్యుత్ డిమాండ్ 224 గిగావాట్లకు చేరినప్పటికీ, జులైలో అది క్షీణించి 209 గిగావాట్లకు చేరుకుంది. ఆ తర్వాత ఆగస్టులో 238.82 గిగావాట్లు, సెప్టెంబర్‌లో 243.27 గిగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉన్నది. 
 
అక్టోబర్‌లో దేశంలో విద్యుత్ డిమాండ్ 222.16 గిగావాట్లు కాగా, నవంబర్‌లో 204.86 గిగావాట్లు రికార్డయ్యింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే, జున్‌ నెలల్లో కురిసిన వర్షాల కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ తగ్గినా ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో పాటు పండుగల సీజన్‌కావడంతో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంతో విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగింది.