ప్రజాపాలనలో కేసీఆర్ సలహాలు, సూచనలు తీసుకుంటామని చెబుతూ కేసీఆర్ ఆరోగ్యంపై మరింత జాగ్రత్త తీసుకోవాలని వైద్యులను ఆదేశించామని చెప్పారు. సోమాజీగూడ యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు.
అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో భేటీ అయ్యారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పడు పర్యవేక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం వైద్య, ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీని యశోద ఆస్పత్రికి పంపించారు.
కాగా, ఫాంహౌజ్ లో గురువారం అర్ధరాత్రి బాత్ రూమ్ లో కేసీఆర్ కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు యశోద ఆస్పత్రి వైద్యుల బృందం హిప్ ప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స తర్వాత తొలిసారి వైద్యులు శనివారం నడిపించారు. వైద్యుల సూచనలతో వాకర్ సాయంతో కేసీఆర్ మెల్లగా అడుగులు వేశారు.
కేసీఆర్ వాకర్ సాయంతో నడుస్తున్న వీడియోను వీడియో సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేసింది. తుండి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకుంటారని చెప్పారు. కేసీఆర్ మానసికంగా దృఢంగా ఉన్నారని, మరో రెండు మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
More Stories
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్
తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం