వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలని, తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. తప్పుడు డిక్లరేషన్ తో ఓటు నమోదు ధరఖాస్తు చేస్తే జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. 20 ఏళ్లు పైబడ్డ వాళ్లు ఫామ్ 6 ద్వారా ధరఖాస్తు చేస్తే అధికారులు విచారించి రిమార్కులు ఇవ్వాలని సూచించారు.
ఇలా ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండటం వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు తావిచ్చినట్లు అవుతుందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కు లేఖ వ్రాసారు.
ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగడం లేదని ఆయన తెలిపారు. మాన్యువల్ ప్రకారం జనాభా పరమైన సారూప్య ఎంపికలు, ఫోటో గ్రాపిక్ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో అనేక నియోజకవర్గాలలో ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీలో ఓట్ల తొలగింపుతో పాటు కొత్త ఓట్ల నమోదుపైనా టీడీపీ, వైసీపీ ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
More Stories
మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల