ఈదురు గాలుల ప్రభావంతో కోతకు వచ్చిన పంట పొలాలు నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు గాను సముద్ర తీర ప్రాంత మండలాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అలల ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సముద్రం 10 మీటర్లు ముందుకు రావటంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు.
నెల్లూరులో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాగుంట లేఔట్ ప్రధాన రహదారి వెంబడి ఉన్న అపార్ట్ మెంట్లు , షాపింగ్ మాల్ లో నీటిలో మినిగిపోయాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పెన్నా పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడే అవకాశ ఉంది. రాయల సీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉతరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. మత్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, హైదరబాద్లో ఇవాళ మోస్తారు జల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, చిరుజల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని హైటెక్ సిటి, కూకట్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి.
More Stories
మంత్రికి వత్తాసు పలికారని కడప పోలీసులకు చార్జ్ మెమోలు
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన మీనా
ఏపీలో పెట్రోల్ బంక్లపై ఆంక్షలు