* టీమిండియాకు ఫినిషర్ లోటు తీరుస్తున్న రింకూసింగ్
యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు సత్తాచాటింది. ఇటీవల వన్డే ప్రపంచకప్ నెగ్గిన ఆస్ట్రేలియాపై మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో యంగ్ఇండియా 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. తద్వారా 5 మ్యాచ్ల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. నయా ఫినిషర్ రింకూ సింగ్ (29 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా, వికెట్ కీపర్ జితేశ్ శర్మ (19 బంతుల్లో 35; ఒక ఫోర్, 3 సిక్సర్లు), యశస్విజైస్వాల్ (37; 6 ఫోర్లు, ఒక సిక్సర్), రుతురాజ్ గైక్వాడ్ (32; 3 ఫోర్లు, ఒక సిక్సర్) తలాకొన్ని పరుగులు చేశారు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1)తో పాటు తొలి మూడు మ్యాచ్లకు దూరమైన శ్రేయస్ అయ్యర్ (8) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ను పక్కన పెట్టగా.. వారి స్థానాల్లో జితేశ్ శర్మ, శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, ముఖేశ్ కుమార్ బరిలోకి దిగారు.
మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఐదు మార్పులతో బరిలోకి దిగింది. వన్డే ప్రపంచకప్లో ఆడిన జట్టులో ట్రావిస్ హెడ్ ఒక్కడే ఈ మ్యాచ్లో ఆడాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షే 3, బెహ్రాన్డార్ఫ్, తన్వీర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ మాథ్యూ వేడ్ (36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అత్యధిక స్కోరర్ కాగా.. హెడ్ (16 బంతుల్లో 31; 5 ఫోర్లు, ఒక సిక్సర్) పర్వాలేదనిపించాడు.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3, దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన ఆఖరి పోరు ఆదివారం బెంగళూరులో జరగనుంది.
More Stories
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం