కాగా ఆదివారం హమాస్ విడిచిపెట్టిన బందీలలో నాలుగు సంవత్సరాల ఇజ్రాయెలీ అమెరికన్ బాలిక కూడా ఉన్నారు. పాలస్తీనియా బందీలను మరింత ఎక్కువ సంఖ్యలో విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ కూడా ముందుకు రావల్సి ఉందని హమాస్ అభ్యర్థించింది. ఈజిప్టు, ఖతార్ పరోక్షంగా అమెరికా వైపు నుంచి చేసిన దౌత్యయత్నాలు పాక్షికంగా ఫలించాయి.
మరో వైపు ఇప్పటి కాల్పుల విరమణను మరి కొద్దిరోజులు పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే తమ దేశస్తులను హమాస్ మరింత ఎక్కువ సంఖ్యలో విడిచిపెట్టాలని, ప్రతి పది మంది విడుదలకు మరో రోజు కాల్పులు విరమించడం జరుగుతుందని ఇజ్రాయెల్ షరతు పెట్టింది.
ఇదే క్రమంలో హమాస్ కూడా ఇప్పుడు కాల్పుల విరమణను పొడిగించాలని, దీనికి ప్రతిగా పాలస్తీనియన్లను విడిచిపెట్టాలని కోరడంతో ఈ దిశలో సానుకూలత ఏర్పడుతుందని ఆశిస్తున్నారు. ఇంటర్నేషనల్ రెడ్క్రాస్ సొసైటీ నివేదిక ప్రకారం ఇప్పటివరకూ హమాస్ 17 మంది బందీలను విడిచిపెట్టగా వీరిలో 13 మంది ఇజ్రాయెలీలు, ముగ్గురు థాయ్స్, ఒక్కరు రష్యన్ ఉన్నారు.
ఇప్పుడు హమాస్ చెర నుంచి బయటపడ్డ వారిలో నాలుగు సంవత్సరాల అమెరికన్ అబిగలి ఎడాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షులు జో బైడెన్ నిర్థారించారు. అక్టోబర్ 7వ తేదీ నాటి హమాస్ దాడిలో ఈ చిన్నారి తల్లిదండ్రులు బలి అయ్యారు. హమాస్ విడిచిపెట్టిన వారిలో ఈ చిన్నారి తొలి బాలిక అయ్యారు.
మరోవంక, ప్రస్తుతం ఈ ప్రాంతంలో నెలకొన్న మారణకాండను ఆపివేసేందుకు `రెండు దేశాలు’ ప్రయిటపడనను కార్యరూపం దాల్చాలని అరబ్ దేశాలు, ఐరోపా యూనియన్ ప్రతినిధులు స్పెయిన్ లో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు.
More Stories
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్