‘మన కుర్రాళ్లు అద్భుతంగా ప్రపంచకప్ను దాదాపు గెలిచారు కానీ ఓటమిపాలయ్యారు. అయితే, అక్కడికి వచ్చిన ఓ అపశకునం వల్లే ఓడిపోయారంటూ ప్రధానిని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యనించారు. అలాగే, జేబుదొంగల కథను చెప్పారు. ముగ్గురు వ్యక్తులు పిక్ పాకెట్ కోసం వస్తారు. ఓ జేబుదొంగ దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తాడు. రెండోవాడు వెనుక నుంచి జేబును కత్తిరిస్తాడు. మూడోవాడు చూస్తూ ఉండి దాడికి సిద్ధంగా ఉంటాడు’ అని వ్యాఖ్యానించారు.
‘జేబు దొంగల దృష్టి మళ్లించే వ్యక్తి ప్రధాని మోదీ అని.. జేబులు కొట్టేవాడు అదానీ అని.. మూడో జేబుదొంగ అమిత్ షా’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. నైతిక ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నందున వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల చట్టాలు, మోడల్ ప్రవర్తనా నియమావళికి సంబంధించిన మార్గదర్శకాలతోపాటు విలువలకు గౌరవం లేదని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీని ఆశ్రయించారు. ప్రధాని మోదీపై చేసిన పనౌతీ వ్యాఖ్యకు వివరణ ఇచ్చేందుకు శనివారం వరకూ రాహుల్ కు ఈసీ గడువు ఇచ్చింది.
శనివారమే రాజస్తాన్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్లో తన ప్రచారంలో రాహుల్ గాంధీ ఇతర అవమానకరమైన పదాలను ఉపయోగించారని, ధృవీకరించని ఆరోపణలు చేశారని బీజేపీ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఒక సీనియర్ నాయకుడికి ఇలాంటి పదజాలం తగదని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
More Stories
బెంగళూరులో సగం మంది ఓటర్లు ఇంటికే పరిమితం
కేజ్రీవాల్ జైలులో సీఎంగా కొనసాగడంపై హైకోర్టు అసహనం
రెండో దశలో 64.2 శాతం పోలింగ్