ఆంధ్రప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం పాల్పడుతున్న కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆమె చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేసి కక్షాపూరిత రాజకీయాలతో కాలం గడుపుతోందని ఆమె విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్ ఇతర పార్టీలతో సంబంధాలు అంటగట్టడం దారుణం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నెల్లూరులో మీడియా సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు కేంద్రమే నిధులిస్తోందని, వైఎస్ జగన్ ప్రభుత్వం సొంతంగా చేస్తున్న పని ఒక్కటీ లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, మరోవైపు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఏపీలో రోడ్ల పరిస్థితిపై సోషల్ మీడియాలో జోకులు వస్తున్నాయని ఆమె ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వం రైతులను కూడా నిర్లక్ష్యం చేస్తోందని పురందేశ్వరి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని పేర్కొంటూ ప్రశ్నించడం విపక్షాల హక్కు అని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే పోటీ చేయడానికి అంగీకారానికి వచ్చాయి. ఉమ్మడి మ్యానిఫెస్టో పైనా కసరత్తు చేస్తున్నాయి. ఇరు పార్టీల నుంచి ప్రతినిధుల బృందం ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యాయి.
More Stories
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ ఏర్పాటు
చంద్రబాబుకు భద్రత పెంచిన కేంద్రం
పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు