చివరి బంతికి క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మినహా.. మిగతా బ్యాటర్లంతా హాఫ్ సెంచరీలో రాణించారు. రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లీ (51) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లు మరో అడుగు ముందుకేసి సెంచరీలతో చెలరేగారు. అయ్యర్ 94 బంతుల్లో 128 రన్స్తో నాటౌట్, కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 102 పరుగులు చేశారు.
భారత్ నిర్దేశించిన 411 పరుగుల ఛేదనలో నెదర్లాండ్స్కు గెలుపు మీద ఆశలేమీ లేకున్నా బ్యాటింగ్కు అనుకూలించే బెంగళూరు పిచ్పై కాస్త ప్రతిఘటించింది. ఓపెనర్ వెస్లీ బరెసి (4)ని సిరాజ్ రెండో ఓవర్లోనే ఔట్ చేశాడు. మరో ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (30), కొలిన్ అకర్మన్ (35) లు రెండో వికెట్కు 61 పరుగులు జోడించారు. అయితే అకర్మన్ను కుల్దీప్ ఔట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే జడ్డూ ఓడౌడ్ను పెవిలియన్ కు పంపాడు.
72కే మూడు వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్ ను సిబ్రండ్.. (80 బంతుల్లో 45) కాస్త ప్రతిఘటించాడు. ఎడ్వర్డ్స్ (17) తో కలిసి కొంతసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే కోహ్లీ.. ఎడ్వర్డ్స్ వికెట్ తీసి డచ్ టీమ్కు భారీ షాకిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఆంధ్రా మూలాలున్న తేజ నిడమనూరు (39 బంతుల్లో 54, 1 ఫోర్, 6 సిక్సర్లు) ఒక్కడే కాస్త రాణించాడు.
అర్థ సెంచరీ పూర్తిచేసిన అతడిని రోహిత్ శర్మ 48వ ఓవర్లో ఔట్ చేయడంతో నెదర్లాండ్స్ కథ ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్ చేయించింది. వికెట్ కీపర్ కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మినహా మిగిలిన 9 మంది బౌలింగ్ చేయడం విశేషం. వన్డే వరల్డ్ కప్లో ఒక జట్టు 9 మంది బౌలర్లను వాడటం ఇది మూడోసారి మాత్రమే.
గతంలో 1987లో ఇంగ్లండ్.. శ్రీలంక మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు 9 మంది బౌలర్లతో బౌలింగ్ చేయించింది. 1992లో న్యూజిలాండ్.. పాకిస్తాన్పై 9 మందితో బౌలింగ్ వేయించింది. సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లలో భారత్.. ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 2003, 2007లలో వరుసగా 11 మ్యాచ్లలో గెలిచింది.
ఆ తర్వాత 9 విజయాలతో (ఈ వరల్డ్ కప్లో) భారత్ ఉంది. 2003లో భారత్.. వరుసగా 8 మ్యాచ్లు గెలుచుకుంది. ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా మెగా టోర్నీలో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచుల్లోనూ గెలిచి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. నాకౌట్ పోరులో నవంబర్ 15న ముంబయిలోని వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
More Stories
కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు
రక్షణ, వాణిజ్య రంగాల్లో చైనా, రష్యా మరింత సహకారం
జూన్ 4 తర్వాత కూటమి విచ్ఛిన్నం ఖాయం