ఐరాసలో ఇజ్రాయేల్‌‌‌కు వ్యతిరేకంగా తీర్మానంకు భారత్ మద్దతు

పాలస్తీనాలో ఇజ్రాయిల్ నివాసాలను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. ‘తూర్పు జెరూసలేంతో సహా ఆక్రమిత పాలస్తీనా, ఆక్రమిత సిరియన్ గోలన్‌ భూభాగంలో పరిష్కార కార్యకలాపాలను ఖండిస్తూ ఐరాసలో చేపట్టిన తీర్మానాన్ని ఆమోదించారు.
దీనిని అమెరికా, కెనడా సహా ఏడు దేశాలు వ్యతిరేకించగా, మరో పద్దెనిమిది దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
రెండు వారాల కిందట ఇజ్రాయేల్- హమాస్ యుద్ధంపై ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానంలో ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.  ఇజ్రాయిల్-హమాస్ పోరుపై మానవత్వం దృష్ట్యా తక్షణ సంధికి పిలుపునిస్తూ జనరల్ అసెంబ్లీలో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. అక్టోబరు 7న ఇజ్రాయేల్‌లోకి చొరబడి నరమేధానికి పాల్పడిన హమాస్ ఉగ్రవాదుల ప్రస్తావన లేదనే కారణంతో భారత్ ఈ తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉంది. 
 
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐరాస స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని భారత్‌ ఉద్ఘాటించింది. ‘ఈ అసెంబ్లీ చర్చలు ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని పంపుతాయని, దౌత్య చర్చల అవకాశాలను విస్తరింపజేస్తాయని మేము ఆశిస్తున్నాం’ అని భారత్ స్పష్టం చేసింది. కాగా, అక్టోబరు 7న మారణకాండకు పాల్పడిన హమాస్‌పై ప్రతీకారంతో ఇజ్రాయేల్ గత 35 రోజులుగా భీకర దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ ఇజ్రాయేల్ దాడుల్లో 11 వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజా తీర్మానంపై తీసుకున్న నిర్ణయం ఈ అంశంలో భారత్ స్థిరమైన, స్థిరమైన వైఖరి ద్వారా మార్గనిర్దేశం చేయబడిందని, ఓటుకు సంబంధించిన దాని వివరణ సమగ్రంగా, సంపూర్ణంగా పునరుద్ఘాటించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడులను ప్రస్తావిస్తూ ఉగ్రవాదంపై ఎలాంటి సందేహం ఉండదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 
 
భారత్ ఓటు గురించి ఐరాసలో డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజ్నా పటేల్ వివరిస్తూ.. ‘మా ఆలోచనలన్నీ బందీలుగా ఉన్నవారి చుట్టూనే ఉన్నాయి. వారిని వెంటనే, షరతులు లేకుండా విడుదల చేయాలని మేము కోరుతున్నాం’ అని తెలిపారు.  ‘ఈ మానవతా సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.. అంతర్జాతీయ సమాజం తీవ్రతను తగ్గించే ప్రయత్నాలను, గాజా ప్రజలకు మానవతా సహాయం అందించడాన్ని మేము స్వాగతిస్తున్నాం… ఈ ప్రయత్నానికి భారతదేశం కూడా సహకరించింది’ అని ఆమె చెప్పారు.

`భారత్ ఎల్లప్పుడూ ఇజ్రాయెల్- పాలస్తీనా సమస్యకు చర్చల ద్వారా ఇరు దేశాల పరిష్కారానికి మద్దతు ఇస్తుంది.. ఇది సురక్షితమైన, గుర్తింపు పొందిన సరిహద్దుల్లో సార్వభౌమ, స్వతంత్ర, ఆచరణీయమైన పాలస్తీనా స్థాపనకు దారితీస్తుంది..ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా పక్క పక్కన ఉంటుంది’ ఆమె స్పష్టం చేశారు.

అక్టోబరు 7 దాడులు జరిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ హమాస్ దారుణాన్ని ‘ఉగ్రవాద’ చర్యగా అభివర్ణించారు. యుద్ధంలో మానవ నష్టం జరగడంతో సంక్షోభానికి మరింత సమతుల్య ప్రతిస్పందనగా మారిందని పాలస్తీనా ప్రస్తావన లేకుండా ఇజ్రాయిల్ ప్రభుత్వానికి నిస్సందేహమైన మద్దతు తెలిపారు.