ఉత్తర ప్రదేశ్ లోని బనారస్ హిందూ యూనివర్శిటీ (బిహెచ్యు)లో శతృత్వాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పై కేసు నమోదైంది. అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ఎబివిపి ) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు శనివారం పోలీసు అధికారులు తెలిపారు.
బిహెచ్యు క్యాంపస్లో గురువారం జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో తమ ఎబివిపి సభ్యుల ప్రమేయం ఉందని అజయ్ రాయ్ వ్యాఖ్యానించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీంతో అజయ్ రాయ్ పై ఐపిసి 505(2) (శతృత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, విద్వేషాన్ని పెంచడం) శుక్రవారం రాత్రి లంకపోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు ఇన్స్పెక్టర్ (క్రైమ్) షాజానంద్ శ్రీవాస్తవ తెలిపారు.
ఈ కేసుపై రాయ్ తీవ్రంగా స్పందిస్తూ ఎబివిపి భయానికి చిహ్నమే ఈ కేసు అని పేర్కొన్నారు. దీంతో ఈ వేధింపులకు ఎవరు పాల్పడ్డారనే అంశం వెల్లడైందని, బిహెచ్యు ఎబివిపి డెన్లాగా మారిందని, బయటి వ్యక్తులను కూడా క్యాంపస్లోకి అనుమతిస్తున్నారని మండిపడ్డారు.

More Stories
ఎస్ఐఆర్ పై మమతా రెచ్చగొట్టే ప్రకటనలు .. ఈసీ
ఉదయనిధిది విద్వేష ప్రసంగమే.. జాతి విధ్వంసం ప్రేరేపిస్తుంది
ముంబై మేయర్ ఎన్నికలో కీలకంగా`రిజర్వేషన్’ పక్రియ