తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను బిజెపి గురువారం ప్రకటించింది. మొత్తం 35 మంది అభ్యర్థులను ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసింది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా ఇప్పటి వరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఇంకా పెండింగ్లో 31 స్థానాలను పెండింగ్ లో ఉంచింది. జనసేనతో పొత్తు ఉంటుందన్న నేపథ్యంలో త్వరలోనే వీటిపై స్పష్టత రానుంది.
ఇక మూడో జాబితాలో చూస్తే అంబర్ పేట నుంచి మాజీ మంత్రి కృష్ణాయాదవ్ పేరు ఖరారైంది. ఉప్పల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు చోటు కల్పించారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి మరోసారి మాజీ మంత్రి బాబు మోహన్ కు అవకాశం ఇవ్వగా, బాన్సువాడ నుంచి మాజీ ఎమ్యెల్యే యెండల లక్ష్మీనారాయణకు అవకాశం ఇచ్చారు.
వనపర్తి నుంచి ఆర్టీసీ యూనియన్ నేతగా గుర్తింపు పొందిన అశ్వథామ రెడ్డికి టికెట్ దక్కింది. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ కు జడ్చర్ల టికెట్ దక్కింది. హైదరాబాద్ నగరంలో ఇంకా కీలకమైన కుక్కడపల్లి, శేరిలింగంపల్లి, మలక్ పెట్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా
- మంచిర్యాల – వీరబెల్లి రఘునాథ్
- ఆసిఫాబాద్ (ఎస్టీ) – అజ్మీరా అత్మారామ్ నాయక్
- బోధన్ – మోహన్ రెడ్డి
- బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ
- నిజామాబాద్ రూరల్ – దినేశ్ కులచారి
- మంథని – సునీల్ రెడ్డి
- మెదక్ – విజయ్ కుమార్
- నారాయణఖేడ్ – సంగప్ప
- అందోల్ (ఎస్సీ) – బాబు మోహన్
- జహీరాబాద్ (ఎస్సీ) – రామచంద్ర రాజ నర్సింహ
- ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
- ఎల్బీ నగర్ – సామ రంగారెడ్డి
- రాజేంద్ర నగర్ – శ్రీనివాస్ రెడ్డి
- చెవేళ్ల – కేఎస్ రత్నం
- పరిగి – మారుతి కిరణ్
- ముషీరాబాద్ – పుస రాజు
- మలక్ పేట్ – సురేందర్ రెడ్డి
- అంబర్ పేట – కృష్ణ యాదవ్
- జూబ్లీహిల్స్ – దీపక్ రెడ్డి
- సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి
- సికింద్రాబాద్ – సారంగపాణి
- నారాయణపేట – పాండు రెడ్డి
- జడ్చర్ల – చిత్తరంజన్ దాస్
- మక్తల్ – జలంధర్ రెడ్డి
- వనపర్తి – అశ్వథామ రెడ్డి
- అచ్చంపేట(ఎస్సీ) – సతీశ్ మాదిగ
- షాద్ నగర్ – అందే బాబయ్య
- దేవరకొండ(ఎస్టీ)- కేస్లావత్ లాలు నాయక్
- హుజుర్ నగర్ – చల్లా శ్రీలతా రెడ్డి
- నల్గొండ – శ్రీనివాస్ గౌడ్
- ఆలేరు – పడాల శ్రీనివాస్
- పరకాల – ప్రసాద్ రావు
- పినపాక(ఎస్టీ)- బాలరాజ్
- పాలేరు – నూన రవి కుమార్
- సత్తుపల్లి(ఎస్సీ) – రామలింగేశ్వర్ రావు
More Stories
తెలంగాణ మంత్రివర్గ సమావేశంకు ఈసీ అనుమతి
యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి
వడ్ల కొనుగోలు వేగవంతం చేయండి రేవంత్