అత్యధిక ఆస్తులున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో రూ.161 కోట్లతో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో రూ.91 కోట్లతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, రూ.91 కోట్లతో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆస్తుల వివరాలకు వస్తే రూ.41 కోట్ల ఆస్తులు ఉండగా, రూ.27 కోట్ల అప్పు ఉంది.
సీఎం కేసీఆర్ కు రూ.23 కోట్ల ఆస్తి ఉండగా, రూ.8 కోట్ల అప్పు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. బీజేపీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆస్తుల వివరాలకు వస్తే ఆయనకు రూ.56 కోట్లు ఆస్తి ఉండగా, రూ.8 కోట్ల అప్పు ఉంది. ఇక యాకుత్పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీకి రూ.19 లక్షల విలువైన ఆస్తులతో రాష్ట్రంలోనే తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్యేగా ఉన్నారు.
అతని తర్వాత ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రవిశంకర్ సుంకే (చొప్పదండి) కేవలం రూ.20 లక్షలతో, ఆత్రం సక్కు (ఆసిఫాబాద్) దాదాపు రూ.27 లక్షలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అప్పులలో రూ. కోటికి పైగా ఉన్న ఎమ్మెల్యేల జాబితాలో రూ.94 కోట్లతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానంలో రూ.63 కోట్లతో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, రూ.40 కోట్లతో దానం నాగేందర్ ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ సంస్థ వెల్లడించింది.
More Stories
బిజెపి రేజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదు
బీజేపీతోనే గిరిజన, దళితులకు గౌరవం
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు