కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగడంపై కేసు నమోదయ్యింది. మహదేవ్పూర్ పోలీసులు ఈ కేసు రిజిష్టర్ చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్రకోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఈ ఫిర్యాదు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పిల్లర్లు కుంగటంపై కుట్ర ఉందన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ అనుమానంతోనే ఫిర్యాదు చేశారు. కాగా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెనుక విద్రోహ శక్తులున్నాయా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. కేసుపై విచారణకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం వచ్చిందని ఫిర్యాదు ఇవ్వడంతో ఆ కోణంపై పోలీసులు దృష్టిపెట్టనున్నారు.

More Stories
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేసిన హైకోర్టు
ప్రముఖ నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు మృతి