వన్డే వరల్డ్ కప్ టోర్నీ -2023లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతోపాటు పాయింట్ల పట్టికలోకి భారత్ టాప్ లోకి దూసుకెళ్లింది. 48 ఓవర్లలోనే న్యూజిలాండ్ విధించిన విజయ లక్ష్యాన్ని భారత్ చేదించింది. అంతకుముందు 274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్లు దూకుడుగానే ఆడారు.
11 ఓవర్లలో 71 పరుగులు చేసిన తర్వాత ఫెర్గూసన్ బౌలింగ్ లో బౌల్డయి రోహిత్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు.. రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు వచ్చాడు. ఆ వెంటనే శుభ్ మన్ గిల్ నూ ఫెర్గూసన్ ఔట్ చేయడంతో జట్టు స్కోర్ ను చక్క దిద్దే బాధ్యత మరోమారు శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీపై పడింది.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కలిసి జట్టును విజయ పథంలో నడిపించారు.
చివర్లో 95 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ అవుట్ కావడంత రవీంద్ర జడేజా ఫోర్ తో విన్నింగ్ షాట్ కొట్టి జట్టును గెలిపించారు. 22వ ఓవర్ లో ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో బంతిని డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా పంపాడు శ్రేయాస్ అయ్యర్, కానీ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కాన్ వే ముందుకు దూసుకొచ్చి క్యాచ్ పట్టాడు. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది.
33వ ఓవర్ లో శాత్నర్ వేసిన తొలి బంతికి కేఎల్ రాహుల్ ఎల్బీ డబ్ల్యూ అయితే, 34వ ఓవర్ లో బౌల్ట్ వేసిన ఐదో బంతిని కవర్ మీదుగా ఔట్ సైడ్ పంపిన సూర్య కుమార్ సకాలంలో క్రీజ్ కు చేరుకోలేకపోవడంతో సాత్నార్, టామ్ లేథమ్ రనౌట్ చేశారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (46), రవీంద్ర జడేజా (39 నాటౌట్) రాణించారు. కివీస్ బౌలర్లలో లోకీ ఫెర్గ్యూసన్ రెండు, ట్రెంట్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ, సాంట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు.
అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్ (130), రచిన్ రవీంద్ర (75) మినహా మిగిలిన కివీస్ బ్యాటర్లు రాణించలేకపోయారు. భారత బౌలర్ మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో న్యూజిలాండ్ను దెబ్బతీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతడికే వచ్చింది. వన్డే ప్రపంచకప్లో తదుపరి టీమిండియా అక్టోబర్ 29న ఇంగ్లండ్తో తలపడనుంది.
More Stories
అమిత్ షాకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్