తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 52 మందితో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. బిజెపికి చెందిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావులు అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు. తొలి జాబితాలో బీసీలు, మహిళలకు పెద్దపీట వేశారు. 20 మంది బీసీలు, 12 మంది మహిళలకు చోటు కల్పించారు. 8 మంది ఎస్సీలు, ఆరుగురు ఎస్సీలకు అవకాశమిచ్చారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ నుంచి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బోథ్ నుంచి పోటీచేస్తారు. మరోవైపు తొలి జాబితాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు కనిపించలేదు. కాగా, ఎంఎల్ఎ రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ బిజెపి సెంట్రల్ డిసిప్లెనరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం ఆగస్టులో రాజాసింగ్ను బిజెపి సస్పెండ్ చేసింది. తిరిగి ఆయనను గోషామహల్ నుండి పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.
సిరిసిల్ల అభ్యర్థిగా రాణి రుద్రమా రెడ్డి పేరును ప్రకటించారు. ఖానాపూర్ నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, చొప్పదండి నుంచి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, ఖైరతాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పోటీ చేయనున్నారు. కల్వకుర్తి నుంచి మరోసారి ఆచారికే అవకాశం లభించింది. ఇక బీఆర్ఎస్ నుంచి చేరిన బోగా శ్రావణికి జగిత్యాల టికెట్ ఖరారైంది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కు మానకొండూరు సీటును ప్రకటించింది. గతేడాది జరిగిన ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు జాబితాలో చోటుచేసుకోలేదు.
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా:
- సిర్పూర్ – పాల్వాయి హరీశ్ బాబు
- బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి
- ఖానాపూర్ (ఎస్టీ) – రమేశ్ రాథోడ్
- ఆదిలాబాద్ – పాయల్ శంకర్
- బోథ్(ఎస్టీ) – బాపూరావ్(ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు)
- నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి
- ముథోల్ – రామరావు పటేల్
- ఆర్మూర్ – రాకేశ్ రెడ్డి
- జుక్కల్ (ఎస్సీ) – టి. అరుణతార
- కామారెడ్డి – వెంకటరమణారెడ్డి
- నిజామాబాద్ అర్బన్ – సూర్యనారాయణ గుప్తా
- బాల్కొండ – అన్నపూర్ణమ్మ
- కోరుట్ల – ధర్మపురి అర్వింద్(నిజామాబాద్ ఎంపీ)
- జగిత్యాల – బోగా శ్రావణి
- ధర్మపురి(ఎస్సీ) – ఎస్ కుమార్
- రామగుండం – సంధ్యారాణి
- కరీంనగర్ – బండి సంజయ్ కుమార్(ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ)
- చొప్పదండి(ఎస్సీ) – బొడిగే శోభ
- సిరిసిల్ల – రాణి రుద్రమ రెడ్డి
- మానకొండూరు (ఎస్సీ) – ఆరెపల్లి మోహన్
- హుుజురాబాద్ – ఈటల రాజేందర్
- నర్సాపూర్ – ఎర్రగొల్ల మురళీ యాదవ్
- పటాన్ చెరు – నందీశ్వర్ గౌడ్
- దుబ్బాక – రఘునందన్ రావు
- గజ్వేల్ – ఈటల రాజేందర్
- కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్
- ఇబ్రహీంపట్నం – నోముల దయానంద్ గౌడ్
- మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్
- ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి
- కార్వాన్ – అమర్ సింగ్
- గోషామహల్ – రాజాసింగ్
- చార్మినార్ – మేఘా రాణి
- చంద్రాయణగుట్ట – సత్యనారాయణ ముదిరాజ్
- యాకుత్ పుర- వీరేందర్ యాదవ్
- బహుదూర్ పుర – వై నరేశ్ కుమార్
- కల్వకుర్తి – టి. ఆచారి
- కొల్లాపూర్ – సుధాకార్ రావు
- నాగార్జున సాగర్ – నివేదితా రెడ్డి
- సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వరరావు
- భువనగిరి – గూడురు నారాయణ రెడ్డి
- తుంగతుర్తి(ఎస్సీ) – కడియం రామచంద్రయ్య
- జనగాం – దశ్మంథ్ రెడ్డి
- స్టేషన్ ఘన్ పూర్(ఎస్సీ) – విజయ రామరావు
- పాలకుర్తి – రామ్మోహన్ రెడ్డి
- డోర్నకల్ (ఎస్టీ) – భూక్యా సంగీత
- మహబూబాబాద్ (ఎస్టీ) – హుస్సేన్ నాయక్
- వరంగల్ పశ్చిమ – రావు పద్మా
- వరంగల్ తూర్పు – ఎర్రబెల్లి ప్రదీప్ రావు
- వర్థనపేట(ఎస్సీ) – కొండేటి శ్రీధర్
- భూపాలప్లలి – చందుపట్ల కీర్తి రెడ్డి
- ఇల్లందు (ఎస్టీ) – రవీంద్ర నాయక్
- భద్రాచలం (ఎస్టీ) – కుంజ ధర్మారావు
More Stories
మోదీకి అండగా 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం
కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు
రక్షణ, వాణిజ్య రంగాల్లో చైనా, రష్యా మరింత సహకారం