ఈ క్రమంలోనే గత ఫిర్యాదులు, తాము ఉర్తించి అంశాల ఆధారంగానే కాకుండా ఇంకా ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసింది. అనంతర పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితమైన ఆదేశాలనివ్వడంతో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
సరిహద్దుల్లో 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సరైన వివరాలు లేని నగదు, ఆభరణాలతో పాటు అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యం, కానుకలు, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నెల 9 నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ. 87కోట్ల 92 లక్షలుకాగా, అక్రమ సరఫరా ద్వారా పట్టుబడిన మద్యం 65223 లీటర్లు. 18,874 కిలోల నల్ల బెల్లం, 655 కిలోల ఆలం కాగా.. వాటి విలువ రూ.10.21కోట్లు.
రూ.7.72 కోట్ల విలువైన 2950 కిలోల గంజాయి పట్టుబడింది. సరైన ఆధారాలు, పత్రాలు, వివరాలు లేని 181 కిలోల బంగారు, 693 కిలోల వెండి, 154 క్యారట్ల వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.120 కోట్ల 40 లక్షలకు పైగా ఉంది. వీటితో పాటు రూ.17.48 కోట్ల విలువైన ల్యాప్టాప్లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి, బియ్యం మొదలైన వస్తువులు పటుబడ్డాయి.
2018 ఎన్నికల సమయంలో రూ.97 కోట్ల నగదు, 2.3 కోట్ల విలువైన మద్యం, రూ.42 లక్షల విలువైన మత్తు పదార్థాలు, 3.2 కోట్ల బంగారం, వెండి, తదితర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మరో రూ. 34 కోట్ల విలువైన ఇతర వస్తువులు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నగదు, అన్ని వస్తువులను కలిపితే 2018 ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ రూ.137 కోట్ల 97 లక్షలు మాత్రమే.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు