దేశవ్యాప్తంగా నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న అతి తక్కువ ప్రాంతాలలో ఛత్తీస్గఢ్ఒకటి. ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్ అంటేనే మావోయిస్టుల అడ్డా అని పేరున్నది. ఈ ప్రాంత ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయాలంటే నానా తిప్పలు పడేవాళ్లు. కనీసం 10 కిలోమీటర్లు నడిచి వెళ్లి ఓటేసే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో నక్సల్స్ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో.. ఈ జిల్లాలోని 40 గ్రామాల్లోని ప్రజలు గత 40ఏళ్లుగా ఓటు హక్కును వినియోగించు కోలేకపోయారు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించడమే చాలా కష్టంగా ఉండేది. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా బస్తర్ రీజియన్లోని 120కిపైగా గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ 120కి పైగా గ్రామాలు దాదాపు అడవిని ఆనుకొని ఉంటాయి. త్వరలో జరుగనున్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా గ్రామాల ప్రజలు తమ ఊరిలోనే ఓటు వేయవచ్చు. గత 5ఏళ్లల్లో ఆయా ప్రాంతాల్లో 60కి పైగా భద్రతా దళాల క్యాంప్లను ఏర్పాటు చేశారు. భద్రతా దళాలు అక్కడి పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తూ ఉండేవారు. ఫలితంగా అక్కడ పరిస్థితుల్లో భారీ మార్పులు కనిపించాయి. 5ఏళ్లల్లోనే ఆ గ్రామాల్లో ఓటింగ్ నిర్వహించడం సులభమైపోయింది.
ఇక ఇప్పుడు ఈ ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. “నవంబర్ 7న బస్తర్ విభాగంలోని 7 జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేస్తున్నాము. ఎన్నికల ప్రక్రియ సవ్యంగా జరిగేందుకు అన్ని విధాలుగా కృషిచేస్తున్నాము. ఈసారి అంతా సరిగ్గానే జరుగుతుందని నమ్మకంగా ఉంది,” అని బస్తర్ డివిజన్ ఐజీపీ సుందర్రాజ్ తెలిపారు. ఛత్తీస్గఢ్లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.
More Stories
దక్షిణాదిన భారీ వర్షాలు.. ఉత్తరాదిన వడగాల్పులు
4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్
కోవాగ్జిన్ తీసుకున్న 30 శాతం మందిలో ఆరోగ్య సమస్యలు