సొంత కుటుంబ సభ్యులతో సీఎం కేసీఆర్కు ప్రమాదం ఉందని అనుమానం కలుగుతోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎమయ్యాడోనన్న పరేషానీ మొదలైందని చెబుతూ ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకుందని స్పష్టం చేశారు. కేసీఆర్ తర్వాత సీఎం పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్లు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.
తనకంటే జూనియర్ కేటీఆర్ సీఎం అవుతాడేమోనన్న ప్రస్టేషన్లో హరీష్ రావు ఉన్నాడని పేర్కొంటూ అందుకనే రైల్వేస్టేషన్లో పిచ్చివాడిలా హరీష్ చిల్లరగా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడుతున్నాడని అంటూ రేవంత్ రెడ్డిపై ఎందుకంత ప్రేమ? కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి నాయకులను కేసీఆరే పంపిస్తున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ చేస్తారని, గెలిచాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళతారని స్పష్టం చేశారు.
తనపై ప్రధాని మోదీ చేసిన వాఖ్యలపై ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పసుపు బోర్డు రావడంతో ముఖం ఎక్కడ పెట్టుకోవాలో బీఆర్ఎస్ నేతలకు అర్థం కావటం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పసుపు బోర్డు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి చూపించామని చెప్పారు. పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపినందుకు ధన్యవాదాలు తెలిపారు. పసుపు రైతుల దశాబ్దాల కల మోదీ నెరవేర్చార అర్వింద్ కొనియాడారు.
More Stories
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్
తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం