మణిపుర్ లో తాజా హింసను కారణమైన ఇద్దరు మైతేయి ప్రేమికుల హత్యకు సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ఆరుగురిని సీబీఐ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ఈశాన్య రాష్ట్రంలో కుకీలకు మైతేయి తెగలకు మధ్య హింసాకాండ ఉద్ధృతంగా జరుగుతున్న సమయంలో ఇద్దరు ప్రేమికులను గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు.
జూలైలో మణిపూర్లో జరిగిన ఇద్దరు విద్యార్థుల దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. వారి ఫొటోలు గతవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మే 3న మైతీ, కుకీ జాతుల మధ్య హింస ప్రారంభమైన ఇంఫాల్కు 51 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతం జిల్లా చురచంద్పూర్లో నిందితులు ఉన్నట్లు నిఘా సమాచారం అందింది.
దీంతో ఆ రాష్ట్రంలో మళ్లీ ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో శాంతి భద్రతలు మళ్లీ చేయి దాటిపోయాయి. జులై 6న, 17 ఏళ్ల అమ్మాయి 20 ఏళ్ల యువకుడు కలిసి పారిపోయి కుకీ తెగలు ఉన్న ప్రాంతంలో చిక్కుకోగా అక్కడ వీరిని హత్య చేశారు. హత్య నేపథ్యంలో అసత్య ప్రచారాలు వ్యాపిస్తాయనే కారణంతో ఇంటర్నెట్ పై నిషేధం విధించారు.
తిరిగి సెప్టెంబర్ 23న ఆంక్షలు ఎత్తివేయడంతో వీరి మృతదేహాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. వెంటనే ఎయిర్పోర్ట్కు వారిని తరలించారు.
అక్కడ ఉన్న సీబీఐ బృందానికి అప్పగించారు. అనంతరం నిందితులను విమానంలో అస్సాం రాజధాని గౌహతికి తరలించారు. అయితే నిందితుల అరెస్ట్ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఎయిర్పోర్ట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా, అరెస్టైన నలుగురు నిందితుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇతర నిందితులను పావోమిన్లున్ హాకిప్, మల్సాన్ హాకిప్, లింగ్నీచాంగ్ బైట్, తిన్నిఖోల్గా గుర్తించారు. హత్యకు గురైన విద్యార్థిని స్నేహితుడు లింగ్నీచాంగ్ బైట్ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు నేరం చేసి తప్పించుకున్నప్పటికీ ఏదో ఒక రోజు చట్టానికి దొరికిపోతారని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ స్పష్టం చేశారు. ఇద్దరు విద్యార్థులను దారుణంగా చంపిన నిందితులకు ఉరిశిక్ష పడేలా చూస్తామని ఎక్స్లో పేర్కొన్నారు.
More Stories
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు