ఇంతకీ ఆ ప్రీ-రికార్డ్ వాయిస్లో ఏముందంటే ‘‘అక్టోబర్ 5వ తేదీన క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభం కాదు, వరల్డ్ టెర్రర్ కప్ షురూ అవుతుంది. ‘సిక్స్ ఫర్ జస్టిస్’ ఖలిస్తానీ జెండాలతో అహ్మదాబాద్ను ముట్టడించబోతోంది. మేము నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకోబోతున్నాం” అంటూ పేర్కొన్నాడు.
“మీ బుల్లెట్లకు వ్యతిరేకంగా బ్యాలెట్లను ఉపయోగించబోతున్నాం. మీ హింసకు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నాం. గుర్తుంచుకోండి.. అక్టోబర్ 5న ప్రారంభమయ్యేది వరల్డ్ కప్కాదు, వరల్డ్ టెర్రర్ కప్. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నుండి వచ్చిన సందేశం ఇది’’. ఈ బెదిరింపు వ్యాఖ్యలను పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు.
అంతేకాదు గురుపత్వంత్ సింగ్ పన్నున్ని భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిందని, అతడు విదేశీ దేశం నుంచి సిక్స్ ఫర్ జస్టిస్ అనే నిషేధిత సంస్థని నడుపుతున్నాడని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. భయాన్ని వ్యాప్తి చేయడానిక, దేశంలోని సిక్కులు, ఇతర వర్గాల మధ్య శత్రుత్వం సృష్టించడానికి, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడానికి పన్నన్ ప్రయత్నిస్తున్నాడని అందులో పోలీసులు రాశారు.
ఇంతకుముందు కూడా అతను ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఎఫ్ఐఆర్లో తెలిపారు. కాగా, గురుపత్వంత్ ఇలా హెచ్చరికలు చేస్తున్నా కెనడా ప్రభుత్వంపై అతనిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
More Stories
కాశ్మీర్ లో పోలింగ్కు ముందు రెచ్చిపోయిన ఉగ్రవాదులు
దక్షిణాదిన భారీ వర్షాలు.. ఉత్తరాదిన వడగాల్పులు
4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్