టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన భారత్, డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక అంచనాలను అందుకుంటూ ఆసియా కప్ చేరాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్ పోరులో తాడోపేడో తేల్చుకోనున్నాయి. టీమిండియా, లంక ఈ టోర్నీ ఫైనల్లో తలపడడం ఇది ఎనిమిదోసారి. అయితే, ఐదుసార్లు భారత్ పైచేయి సాధించింది.
టైటిల్ ఫైట్లో భారత జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకూ 11సార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్ ఏకంగా 7 పర్యాయాలు ట్రోఫీని అందుకుంది. మరోవైపు 13 ఫైనల్స్ ఆడిన లంక 6 సార్లు మాత్రమే చాంపియన్గా నిలిచింది. ఇక, పాకిస్థాన్ విషయానికొస్తే ఐదు పర్యాయాలు ఫైనల్లో ఆడినా రెండు సార్లు మాత్రమే విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ జట్టు మూడుసార్లు ఫైనల్లో అడుగుపెట్టింది. కానీ, ఆ మూడుసార్లు రన్నరప్గానే వెనుదిరిగింది. గణాంకాల పరంగా చూస్తే ఆసియా కప్లో భారత జట్టుదే పైచేయి.
కానీ, సొంతగడ్డపై దసున్ శనక బృందాన్ని తక్కువ అంచనా వేస్తే రోహిత్ సేన భారీ మూల్యం చెల్లించుకున్నట్టే. ఎందుకంటే సెప్టెంబర్ 12న జరిగిన సూపర్ 4 మ్యాచ్ అందుకే నిదర్శనం. ఆ గేమ్లో యువ స్పిన్నర్, అండర్ -19 చాంపియన్ దునిత్ వెల్లలాగే దెబ్బకు భారత టాపార్డర్ కుప్పకూలింది. ఈ కుర్ర బౌలర్ కీలకమైన 5 వికెట్లు తీసి కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
అయితే, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. దాంతో, భారత్ 41 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్కు చేరింది. ఆ తర్వాత పాకిస్థాన్పై సంచలన విజయంతో శ్రీలంక టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత జట్టును ఢీ కొననుంది. ఈ మ్యాచ్లో వెల్లలాగే, కుల్దీప్ ఇరుజట్లకు కీలకం కానున్నారు.
More Stories
విదేశీ విద్యార్థులకు కెనడా వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్
ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి
కొవిషీల్డ్తో ప్రమాదకరమైన దుష్ప్రభావాలు