18వ జీ 20 సదస్సు కు ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటూ జీ 20 కి అధ్యక్షత చేపట్టిన సందర్భంగా భారత్ ప్రకటించిన జీ 20 థీమ్ అయిన ‘వసుదైక కుటుంబం’ భావనను ప్రధాని మోదీ మరోసారి గుర్తు చేశారు. ‘‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు’’ అనే భావనను జీ 20 సదస్సు థీమ్ గా నిర్ధారించారు. భారత్ దృష్టిలో ప్రపంచమంటే ఇదేనని పేర్కొన్నారు.
జి20 సదస్సులో ‘‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు’’ సెషన్ కి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ సెషన్ లో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను వెతికే దిశగా చర్చ కొనసాగుతుంది. అలాగే బలమైన, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలను చర్చిస్తారు.
జీ 20 అధ్యక్షత పై ప్రధాన మోదీ స్పందిస్తూ ఇది నిర్ణయాత్మక, లక్ష్యపూరిత బాధ్యతగా అభివర్ణించారు. సమ్మిళిత అభివృద్ధి, బహుముఖియ అంతర్జాతీయ సంస్థలు 21వ శతాబ్దికి అవసరమని ప్రధాని మోదీ తెలిపారు. బహుముఖ అభివృద్ధికి టెక్నలజికల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారనున్నాయని చెప్పారు.
లింగ సమానత్వం దిశగా, మహిళల సాధికారత దిశగా, ప్రపంచ శాంతి దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహాత్మా గాంధీ సమాజంలో అట్టడుగున ఉన్నవారికి సంక్షేమ, అభివృద్ధి పలాలు దక్కాలన్న మహాత్మా గాంధీ ఆలోచనల దిశగా కృషి సాగించాల్సి ఉందని చెప్పారు. వివిధ దేశాల అధినేతలతో జరగనున్న ద్వైపాక్షిక సమావేశాలు ఫలవంతం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
More Stories
స్వాతి మలివాల్పై దాడి గురించి కేజ్రీవాల్ దాటవేత
2029 వరకు ప్రధానిగా నరేంద్ర మోదీ
సీఏఏ కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు