
బుధవారం చంద్రయాన్-3 ల్యాండ్ అయిన అద్వితీయమైన ఘట్టాలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, ఇతర సీనియర్ నాయకులతో కలిసి పెద్ద ఎల్ఈడీ స్క్రీన్పై కిషన్ రెడ్డి వీక్షించారు. విక్రమ్ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయిన సందర్భంలో కిషన్ రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. అనంతరం అందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని వీక్షించారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో నాయకులు త్రివర్ణపతాకాలు చేతబూని భారత్ మాతాకీ జై, జై జవాన్ ‑ జై కిసాన్ – జై విజ్ఞాన్ నినాదాలు చేశారు. టపాసులు కార్చారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ‘ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా భారత్ కొత్త చరిత్రను లిఖించింది. ఈ సందర్భంగా ఇస్రో, చంద్రయాన్ టీమ్ ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను’ అని తెలిపారు.
ఇటీవలే రష్యా కూడా చంద్రుడి దక్షిణ ధృవంపై దిగేందుకు విఫలయత్నం చేయడం, వివిధ దేశాలు కూడా ఈ దిశగా ప్రయత్నించి విఫలమయిన సందర్భాల్లో భారత్ సాధించిన ఈ విజయం యావత్ ప్రపంచానికి చంద్రునిపై చేయబోయే ప్రయోగాల్లో ఓ దిక్సూచిగా ఉంటాయని ఆయన చెప్పారు. చంద్రయాన్ విజయం అంతర్జాతీయ ప్రయోగాల చరిత్రలో ఓ ప్రధానమైన మలుపు అని కిషన్ రెడ్డి అభివర్ణించారు.
More Stories
కాళేశ్వరంలో అవినీతి అనకొండ హరిరామ్ అరెస్ట్
కేసీఆర్ కు కుటుంబ సభ్యుల నుంచే ముప్పు
లద్దాఖ్, పీఓకె లేని భారత్ మ్యాప్ వివాదంలో రేవంత్ ప్రభుత్వం