కావేరి జలాల పంపకం వివాదంపై `సుప్రీం’ రాజ్యాంగ ధర్మాసనం

కావేరీ జలాల పంపకంపై తమిళనాడు, కర్ణాటక మధ్య కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ విషయాన్ని సోమవారం వెల్లడించింది. 

తమిళనాడు ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహ్‌తగ్ ఈ సమస్యపై అత్యవసరంగా విచారించాలని చీఫ్ జస్టిస్ డివైచంద్రచూడ్, జస్టిస్‌లు జెబి పార్ధివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఆగస్టు నెలకు సంబంధించి కావేరీ జలాలను విడుదల చేయాలని కోరుతూ కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి తమిళనాడు ప్రభుత్వం దరఖాస్తు సమర్పించిందని చెప్పారు.

దీనిపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 2023 సెప్టెంబర్ 15లోగా తమ వాదనలను కోర్టుకు సమర్పించాలని రాష్ట్రాలను అత్యున్నత న్యాయస్థానం అదేశించింది. కావేరీ జలాల నుంచి తమకు రావలసిన వాటా పొందడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్ప మరో దారి లేదని ఈనెల 11న తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. 

ఆగస్టు 10 న కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ సమావేశంలో తమిళనాడుకు రోజుకు 15,000 క్యూసెక్కుల వంతున 15 రోజుల పాటు కావేరీ జలాలు అందించడానికి ఏకగ్రీవంగా నిర్ణయమైనా కర్ణాటక తరువాత తన వైఖరి మార్చుకుని కేవలం 8000 క్యూసెక్కులు మాత్రమే పంపిణీ చేస్తామని చెబుతోందని తమిళనాడు వాట్ రీసోర్సెస్ మంత్రి దురై మురుగన్ పేర్కొన్నారు. అందువల్ల సుప్రీం కోర్టును ఆశ్రయించవలసి వచ్చిందని చెప్పారు.

కావేరీ జలాల వివాదం కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి మధ్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడి లక్షలాది మంది ప్రజలకు ఇరిగేషన్, తాగునీటి అవసరాలను కావేరీ జలాలు తీరుస్తున్నాయి. దీంతో కావేరీ జలాల పంపాకలపై తరచు రాష్ట్రాల మధ్య విభేదాలు చేరుకుంటున్నాయి. దీనిపై చివరిసారిగా 2018లో సుప్రీంకోర్టు విచారణ జరిపి, కావేరీ మేనిజిమెంట్ స్కీమ్‌ను నోటిఫై చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. 

జలాల పంపాకలపై సుప్రీంకోర్టు తీర్పును అమలును చేసేందుకు ఈ స్కీమ్‌ను ఉద్దేశించారు. అయితే, కావేరీ మేనేజిమెంట్ స్కీమ్‌ను ఇంతవరకూ కేంద్రం నోటిఫై చేయలేదు. దీంతో తరచు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది.