యువమోర్చా అధ్యక్షునిగా మిట్ట వంశీ, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా బి నిర్మలా కిషోర్, కిసాన్ మోర్చా అధ్యక్షునిగా చ. కుమార్ స్వామి, ఎస్సీ మోర్చా అధ్యక్షునిగా గుడిసె దేవానంద్, ఓబిసి మోర్చా అధ్యక్షునిగా ఉమామహేశ్వరరావు, మైనార్టీ మోర్చా అధ్యక్షుడుగా షైక్ బాజీ, మీడియా ఇంఛార్జ్ గా పాతూరి నాగభూషణంలను నియమించారు.
అధికార ప్రతినిధులుగా పూడి తిరుపతిరావు, లంక దినకర్, సుధీష్ రాంబట్ల, ఆర్ డి విల్సన్, సాదినేని యామినీ శర్మ, పెద్దిరెడ్డి రవికిరణ్, డాక్టర్ వినుషా రెడ్డి లను నియమించారు. సోషల్ మీడియా ఇంచార్జ్ గా కేశవ కాంత్ వ్యవహరిస్తారు.
ఇలా ఉండగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. ఆగస్టు 21న అమరావతికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీకి సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియను ఆయన సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ, ఏపీతోపాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశా ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించే బాధ్యతను కూడా పార్టీ అధిష్టానం బండి సంజయ్కు అప్పగించింది.
More Stories
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ ఏర్పాటు
చంద్రబాబుకు భద్రత పెంచిన కేంద్రం
పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు