న్యాయ వ్యవస్థ విధానాలు, సంస్కరణలు అనే అంశంపై ఈ నివేదికను ఆ కమిటీ రూపొందించింది. ఈ స్థాయి సంఘానికి బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ నేతృత్వం వహించారు. ‘‘ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని ప్రకటించేంత వరకు సుప్రీంకోర్టు వెళ్లింది. అలాంటప్పుడు, సుప్రీంకోర్టు, హైకోర్టుల జడ్జీలు కూడా తమ ఆస్తులను ప్రకటించాలి కదా’’ అని సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు.
న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయస్సు పెంపు, మహిళలు, ఇతర అణగారిన వర్గాల వారికి న్యాయ వ్యవస్థలో సముచిత అవకాశాలు కల్పించడం, జడ్జీల వెకేషన్ కాలాన్ని తగ్గించడం, ప్రాంతీయంగా సుప్రీంకోర్టు బెంచ్ లను ఏర్పాటు చేయడం.. మొదలైన ఇతర సిఫారసులను కూడా ఆ పార్లమెంటరీ కమిటీ చేసింది.
కాగా, సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల ప్రకటనల దిశగా సుప్రీంకోర్టు 2009 లోనే చర్యలు తీసుకుంది. ప్రతీ సంవత్సరం సుప్రీంకోర్టు జడ్జీలు తమ ఆస్తులను స్వచ్చంధంగా ప్రకటించాలని, వాటిని సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సూచించింది. 2009 సెప్టెంబర్ 8 న సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ (అందరు న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ధర్మాసనం) ఈ నిర్ణయం తీసుకుంది.
More Stories
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు