కుక్కీ నార్కో ఉగ్రవాదులకు ఆల్ఖయిదా సహకారం అందిస్తున్నట్లు ఓ రిపోర్టులో తేలింది. గంజాయి సాగు పెరగడం, రోహింగ్యా ముస్లింలకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలన్న లక్ష్యంతో అక్కడ ఆల్ఖయిదా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కుక్కీ నార్కో టెర్రరిస్టులకు ఆల్ఖయిదా మద్దతు ఇవ్వడం వల్ల యావత్ ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.
`సుప్రీం’ విచారణకు హాజరైన మణిపూర్ డిజిపి
మరోవంక, సుప్రీంకోర్టు జారీ చేసిన సమన్ల మేరకు మణిపూర్ డీజీపీ విచారణకు హాజరయ్యారు. డీజీపీ రాజీవ్ సింగ్ సోమవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టుకు వెళ్లారు. మణిపూర్లో జరుగుతున్న హింసపై జిల్లా స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందాలతో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకు కేంద్రం వెల్లడించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ వేసిన ప్రశ్నలకు డీజీపీ రాజీవ్ సింగ్ సమాధానం ఇచ్చారు.
మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో ఒకవేళ 11 కన్నా ఎక్కువ సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదు అయి ఉంటే, అప్పుడు జిల్లా స్థాయిలో ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్తో విచారణ జరిపించనున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. మణిపూర్లో గత కొన్ని నెలల నుంచి రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన వీడియో కూడా దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇక పార్లమెంట్లోనూ మణిపూర్ అంశంపై చర్చించాలని విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మణిపూర్ లో జరుగుతున్న సీబీఐ దర్యాప్తులను పర్యవేక్షణ చేయనున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. మాజీ జడ్జీలు జస్టిస్ షాలినీ జోషీ, జస్టిస్ ఆషా మీనన్ ఆ కమిటీలో ఉన్నారు.
More Stories
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం
బ్రిజ్భూషణ్ టికెట్ను కొడుక్కి బిజెపి సీట్