ఎన్‌డిఎలో చేరికపై జెడిఎస్ – బిజెపి చర్చలు

వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు జెడిఎస్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డిఎ)లో చేరడానికి సంబంధించి బిజెపి, జెడిఎస్ ల మధ్య చర్చలు జరుగుతున్నాయని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బస్వరాజ్ బొమ్మై వెల్లడించారు. ఈ రెండు పార్టీల మధ్య జరిగే చర్చల ఫలితాలు భవిష్యత్ రాజకీయ పరిణామాలను నిర్ణయిస్తాయని కూడా ఆయన చెప్పారు.

జెడిఎస్ల మధ్య చర్చలు జరుగుతున్నాయని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బస్వరాజ్ బొమ్మై వెల్లడించారు. ఈ రెండు పార్టీల మధ్య జరిగే చర్చల ఫలితాలు భవిష్యత్ రాజకీయ పరిణామాలను నిర్ణయిస్తాయని కూడా ఆయన చెప్పారు. జెడిఎస్ ఎన్‌డిఎలో చేరుతుందా అన్న విలేఖరుల ప్రశ్నకు ‘బిజెపి అధినాయకత్వం, జెడిఎస్ అధినేత హెచ్‌డి దేవెగౌడ మధ్య జరిగే చర్చల్లో అది నిర్ణయించబడుతుంది’అని బొమ్మయి తెలిపారు.

ఈ దిశగా చర్చలు కొనసాగుతాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘ఈ చర్చల ఫలితాల ఆధారంగా భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఉంటాయి’ అని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి, జెడిఎస్ లు చేరువ కావడం గురించి ఇటీవలి కాలంలో ఈ రెండు పార్టీల నేతలు చాలా స్పష్టమైన సంకేతాలే ఇస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పార్టీ, జెడిఎస్ లు కలిసి పోరాటం చేస్తాయని బిజెపి సీనియర్ నేత , మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప గతంలో చెప్పారు.  లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ అవగాహనకు సంబంధించి సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని జెడిఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా చెప్పడం గమనార్హం.

సోమవారం నాడు జేడీఎస్ నేత కుమారస్వామి మాట్లాడుతూ.. విపక్షాలు జేడీఎస్‌ను తమ భాగస్వామిగా భావించ లేదని, విపక్షాల మహాకూటమిలో జేడీఎస్ చేరే ప్రశ్నకే తావు లేదని కుండబద్ధలు కొట్టారు. కుమారస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్డీయేలో కుమారస్వామి భాగం కాబోతున్నారనే అనుమానాలకు తావిచ్చాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు, కుమారస్వామి తాజా వ్యాఖ్యలు గమనిస్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కలిసి ముందుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కర్నాటకలోని మొత్తం 28 స్థానాలకుగాను 25 సీట్లను గెలుచుకోగా, ఆ పార్టీ మద్దతుతో సినీ నటి సుమలత ఇండిపెండెంటుగా మండ్య నుంచి గెలుపొందారు. కాగా కాంగ్రెస్, జెడిఎస్ లు చెరో సీటు గెలుచుకున్నాయి.