ప్రస్తుతం మార్కెట్ లో టమాటాతో పాటువెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇప్పుడు ఉల్లి కూడా అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్-నవంబర్ నాటికి ఉల్లిపాయల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మరో రెండు నెలల తర్వాత ఉల్లి ధరలు గణనీయంగా పెరగవచ్చని నేషనల్ కమోడిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా వెల్లడించారు. ప్రస్తుతం మనం గత ఉత్పత్తుల నుండి నిల్వ చేసిన బఫర్ స్టాక్ నుండి ఉల్లిపాయలను ఉపయోగిస్తున్నామని, ఈసారి వర్షాలు సకాలంలో పడలేదు కాబట్టి అక్టోబర్-నవంబర్లలో ఈ అంతరాయం ప్రభావాన్ని చూస్తామని ఆయన చెప్పారు.
వర్షాభావంతో శీతాకాలపు ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇది వేరు కూరగాయ కావడంతో పొలాల్లో నీరు చేరి కుళ్లిపోతుందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ సి సి ఎఫ్) ఇప్పటి వరకు 2.9 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను సేకరించినట్లు తెలుస్తున్నది.
ఈ రెండు కేంద్ర ఏజెన్సీల కొనుగోళ్ల ప్రక్రియ మొత్తం మరో రెండు వారాల్లో పూర్తవుతుందని, వీటి ద్వారా ఈ ఏడాది 3 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత ఏడాది ఒక్క నాఫెడ్ ద్వారానే 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి బఫర్ స్టాక్ను రూపొందించింది. ఈసారి ఎన్ సి సి ఎఫ్ కూడా ఉల్లిని సేకరిస్తోంది. మార్కెట్లో ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ను ఉపయోగిస్తుంది.
More Stories
నేరస్తులైన రాజకీయ నేతలను అరెస్టు చేయకుండా ఎలా?
నటి తమన్నా భాటియాకు సైబర్ క్రైమ్ పోలీసుల నోటిస్
ఢిల్లీ లిక్కర్ కేసులో క్విడ్ ప్రోకో